Telangana

గీతమ్ లో నేడు విద్యా నాయకత్వ సమ్మేళనం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లో డిసెంబర్ 13, 2023న (బుధవారం) ‘భారతీయ విద్యా నాయకత్వ సమ్మేళనం’ను నిర్వహించనున్నారు. ఈ ఒకరోజు సమావేశంలో దేశ నలుమూలల నుంచి సీబీఎస్ఈ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు దాదాపు 200 మంది పాల్గొననున్నారు.ఉన్నత విద్యలో లిబరల్ ఆర్ట్స్, స్టెమ్ (సెన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్)ని ఏకీకృతం చేసే చర్చలలో పాల్గొనడానికి, వినూత్న విధానాలను రూపొందించడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడనుంది. పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలను సులభతరం చేయడానికి, మెరుగైన విద్యా పద్ధతుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి గాను దీనిని సంకల్పించారు.ఉన్నత విద్యా రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నూతన ఆవిష్కరణలకు ఉదార విద్య, స్టెమ్ కోర్సులు ఎలా దోహదపడతాయి అనే అంశంపై ప్రముఖులు చర్చించనున్నారు. విద్యా సంస్థల ఉన్నతాధికారు లకు విలువెన అంతరష్టులను అందించడానికి, ఉత్తను అభ్యాసాలను పంచుకోనడానికి, భారతదేశంలో విద్యా భవిష్యత్తును రూపొందించడంలో కొనసాగుతున్న కృషికి తనువంతు సహకారం అందించడానికి ఈ సదస్సు ఉపకరించనున్నది. విద్యా నాణ్యత, ప్రభానాన్ని సింపొందించే సమిష్టి కృషికి ఈ సమావేశం దోహదపడగలదని నిర్వాహకులు ఆశాభావం నెలిబుచ్చారు.ఆసక్తి గల వివిధ సీబీఎస్ఈ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.ఇతర వివరాల కోసం డాక్టర్ కె.శివకుమార్ 9542 42 4256/66ను సంప్రదించాలన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago