పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రంజాన్ పవిత్ర పర్వదినాన్ని ప్రతి ముస్లిం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిఏటా రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ మసీదుల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ముస్లింలకు రంజాన్ తోఫాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దేశంలో హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు సమానంగా చూస్తూ వారి వారి పండుగలకు కేసీఆర్ బతుకమ్మ చీరెలు, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. రాష్టంలో పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న లక్ష్యంతోనే ప్రతి పండుగకు కేసీఆర్ కానుక అందిస్తున్నారన్నారు. ఈ ఏడాది అన్ని మతాల వారు కలసి ఈద్ ఉల్ ఫితర్ను సంతోష వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింల కోసం మైనార్టీ కళాశాలలు, పాఠశాలలు, గురుకులాలు, షాదీ ముబారక్, మోజంలకు జీతాలు ఇలా ఎన్నో పనులు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షులు అజ్మత్, మైనార్టీ మత పెద్దలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…