Telangana

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ

12 ఏళ్లగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

సమాజ సేవ, సుస్థిర అభివృద్ధి పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్లాస్ మేట్ నోట్ బుక్ లు, క్రేయాన్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్టేషనరీ కిట్లతో పాటు భోజనం ప్లేట్లను పంపిణీ చేసింది.చుట్టుపక్కల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యా అవసరాలకు మద్దతుగా, గత 12 సంవత్సరాలుగా గీతం నిరంతరం నిర్వహిస్తున్న సుదీర్ఘకాల అవుట్-రీచ్ కార్యక్రమంలో ఇది ఒక భాగం.ఈ పంపిణీ కార్యక్రమం, ‘వ్యర్థాల నుంచి సంపద’ (Wealth out of Waste – WoW) అనే నినాదంతో గీతం చేపడుతున్న సుస్థిరతా ప్రయత్నం. ఈ కార్యక్రమం ద్వారా, గీతం విద్యార్థులు ఆతిథ్య విభాగం సహకారంతో ప్రాంగణం నుంచి చదివేసిన వార్తాపత్రికలు, పాత రికార్డులు, పుస్తకాలు, ఇతర పునర్వినియోగ కాగితపు సామగ్రిని సేకరిస్తారు.

ఈ సామగ్రిని రీసైక్లింగ్ కోసం ఐటీసీ పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ విభాగానికి అప్పగిస్తారు. ప్రతిఫలంగా, ఐటీసీ క్లాస్ మేట్ విద్యా ఉత్పత్తులను అందిస్తుంది. వీటిని పేద విద్యార్థులకు పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత రెండింటినీ గీతం ప్రోత్సహిస్తోంది.ఈ విద్యా కిట్లను గీతం హైదరాబాద్ రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్, గీతం పూర్వ విద్యార్థి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనూజ్ తదితరులు పంపిణీ చేయగా, ఇ-క్లబ్ చైర్మన్ మాధవ్ భాస్కర్, ఇ-క్లబ్ సభ్యులు సహకరించారు.విద్యార్థులు నోట్ బుక్ లు, స్టేషనరీ కిట్లను ఎంతో ఉత్సాహంగా స్వీకరించి, చిరునవ్వులతో, హృదయపూర్వక కృతజ్జతతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు గీతం, ఐటీసీ అందిస్తున్న నిరంతర మద్దతు, సహకారానికి కృతజ్జతలు తెలియజేశారు.ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంపై శాశ్వత సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల ద్వారా నాణ్యమైన విద్య, పర్యావరణ సుస్థిరత, అర్థవంతమైన సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి గీతం కట్టుబడి ఉందని చెప్పారు.

 

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

15 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

16 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

16 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

20 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

20 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

20 hours ago