కోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి పక్కన గల అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం కోర్టు ఉత్తర్వుల మేరకు డీఎల్పిఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బారి పోలీసు బంధబస్తు మధ్య కూల్చివేస్తున్న పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు.
ఈ సంధర్బంగా డీఎల్పీఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 523, 522, 588 లో గల అక్రమ నిర్మాణాలను హై కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నామని అన్నారు. ఈ నిర్మాణాలకు ఎన్నో సార్లు నోటీసులు జారీ చేసిన కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదని, 7901 కేసు నెంబర్ ఇచ్చిన తీర్పు ఎందుకు అమలు చేయట్లేదని గ్రామ పంచాయతీ పై కంటేప్ట్ కేసు కుడా అయ్యిందని తెలిపారు.
067 జీవో ప్రకారం హైకోర్టు ఆదేశాల మేరకు 10 జేసీబీలతో 20 ట్రాక్టర్ల సహాయంతో బారి బందోబస్తుతో కూల్చివేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రహదారి పైన ఉన్న మిగతా నిర్మాణాలకు కూడా నోటీసులు జారీ చేసి వాటిని కూడా కూల్చివేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…