_ఘనంగా దసరా సంబరాలు
_సృజనాత్మకతను చాటిన విద్యార్థులు
నవరాత్రుల పవిత్రమైన రోజులను జరుపుకోవడానికి మంత్రముగ్ధులను చేసే దాండియా జోష్ కార్యక్రమాన్నిశనివారం హదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలలోభాగంగా జరిగిన ఈ ఉత్సాహభరితమైన వేడుక నిజమైన స్ఫూర్తిని ప్రదర్శించడమే గాక అన్నివర్గాల విద్యార్థులను ఒకచోట చేర్చింది. ప్రాంగణమంతా ఉత్సాహభరితమైన వాతావరణంతో నిండిపోవడంతో పాటు విద్యార్థులతో కోలాహలం కనిపించింది.దుర్గాదేవి పూజతో ప్రారంభమైన దాండియా వృత్య ప్రదర్శన ఉత్తేజకరంగా సాగింది. రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన విద్యార్థులు ఐక్యంగా వేడుకలను నిర్వహిస్తూ, ఉత్సాహంగా, ఆనందంతో కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు.ఈ కార్యక్రమం కేవలం నవరాత్రి వేడుక మాత్రమే కాదని, విద్యార్థులు తను ఆందోళనలను మరచిపోవడానికి కూడా దోహదపడుతుందని స్టూడెంట్ రెస్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. పాపాలను లేదా చెడు లక్షణాలను వదిలించుకోవడంలో దసరా ప్రాముఖ్యతను అర్ధం చేసుకుంటూ విద్యార్థులు : ఆనందాన్ని అనుభవించే వాతావరణాన్ని సృష్టించాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు.విద్యార్థులు తనలో విలిడీకృతంగా ఉన్న నృత్య మెళకువలను ప్రదర్శించి, పండుగ వేళ ఉత్సాహంతో ఉల్లాసంగా గడిపి అందమైన జ్ఞాపకాలతో చిరునవ్వులు చిందిస్తూ ఇంటి ముఖం పట్టారు.విద్యార్థులకు సంపూర్ణ విద్యను అందించడానికి, వారి ప్రతిభ, అభిరుచులను పెంపొందించడానికి గీతం కట్టుబడి ఉందని ఈ వేడుకల నిర్వహణ ద్వారా చాటింది. దాండియా వంటి సృజనాత్మక వేడుకల నిర్వహణ ద్వారా! సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులలో తనుకంటూ ఒక భావాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…