Hyderabad

టీకాతోనే కోవిడ్ కట్టడి – ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడి

పటాన్‌చెరు:

ఈ శతాబ్దంలోనే కోవిడ్ -19 మహమ్మారి అత్యంత ఘోరంగా ఉందని, మొత్తం ప్రపంచ జనాభాకు టీకాలు వేయడం ద్వారానే దానిని కట్టడి చేయగలమని అఖిల భారత వైద్య సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 41వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం విజయవంతంగా జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన గీతం ఫౌండేషన్ ఎండోమెంట్ లెక్చర్ ఇచ్చారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ గీతం 41వ ఫౌండేషన్ అవార్డును ప్రొఫెసర్ గులేరియాకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ రణదీప్ మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణ, జంతువుల ఆవాసాలను కోల్పోవడం, ముఖ్యంగా మనుషులుతో సహజీవనం చేయడం వంటిని 21వ శతాబ్దంలో కోవిడ్ మహమ్మారి పెరగడానికి కీలక కారకాలని అన్నారు. ప్రపంచంలో అత్యధికంగా నమోదైన కోవిడ్ -19 మరణాలలో మనదేశం మూడో స్థానంలో ఉందని, ఇది జీవనోపాధి, ఆరోగ్యం, పాలనా వ్యవస్థ, సామాజిక సమ్మేళనం, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి ముగియలేదని, లేదా ఇదే చివరి మహమ్మారి కాదని ఆయన స్పష్టీకరించారు.

ఈ మహమ్మారి నివారణకు, పూర్తి సంసిద్ధతతో పెట్టుబడులు పెట్టడానికి, భవిష్యత్తులో వచ్చే మహమ్మారిని ఎదుర్కోవడానికి మనం ప్రత్యేకంగా సన్నద్ధం కావాలని డాక్టర్ గులేరియా పిలుపునిచ్చారు. ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, వ్యాక్సిన్ వేయించు కోవడంతో పాటు మాస్కులు ధరించాలని పల్మనరీ మెడిసిన్ లో ప్రసిద్ధుడైన డాక్టర్ రణదీప్ సలహా ఇచ్చారు. వ్యాక్సిన్ పై ఉన్న అపోహలే ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుదలకు అవరోధంగా మారుతోందని, ఎటువంటి సంకోచం లేకుండా అంతా టీకా వేయించుకోవాలన్నారు. వ్యాధికి గురికాకుండా వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని, వాటిని మానవులపై పరీక్షించడంతో పాటు ప్రీ – క్లినికల్ ట్రయల్స్ చేసిన తరువాతే అనుమతి ఇచ్చినట్టు ఆయన చెప్పారు.

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago