Districts

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 96వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

మన వార్తలు ,పటాన్‌చెరు:

పటాన్చెరు శాంతి నగర్ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 96వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ వారు చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు కార్పొరేటర్ గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు.

అనంతరం మాట్లాడుతూ అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా ఎదిగారు. బాబా బోధనలు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయి. మానవులు అరిషడ్వర్గాలను జయించి ఉత్తములుగా ఉండాలని, పరిశుధ్ధ హృదయంతో జీవించాలనీ తమ ఉప న్యాసాల్లో బోధిస్తుంటారని ప్రార్థించే పెదవులకన్నా సేవించే చేతులు మిన్న అని నిత్యం సత్యసాయిబాబా భగవాన్ అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు సహాయం చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎల్లప్పుడూ చెబుతారని అన్నారు సత్య సాయి సేవా సంస్థల అధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు నిరంతరాయంగా నేటికీ జరుగుతుండటం విశేషం.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్ కాడి హారిక విజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago