అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి
వెంటనే వెనిజులా అధ్యక్షుని విడుదల చెయ్యాలి
శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
వెనిజులా పై అమెరికా పాశవిక దాడిని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించాలని శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎమ్ మనోహర్ అన్నారు.వెనిజులా పై అమెరికా దుశ్చర్యను నిరసిస్తూ పటాన్ చెరు పారిశ్రామిక వాడ లో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన, ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎమ్ మనోహర్ మాట్లాడుతూ వెనిజులా లో ఉన్న అపారమైన చమురు, ఖనిజాలపై అమెరికా ఎప్పటినుండో కన్నువేసి అనధికార పెత్తనం చెలాయిస్తూ నేడు అత్యంత పాశవిక దాడికి పాల్పడిందని విమర్శించారు. అమెరికా దుశ్చర్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని, ఐక్యరాజ్య సమితి తక్షమే జోక్యం చేసుకోవాలని, వెనిజులా అధ్యక్షుడిని తక్షణమే విడుదల చెయ్యాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎ. వీరారావు, జాయింట్ సెక్రటరీ వి సదాశివ రెడ్డి, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…