మనవార్తలు,జిన్నారం
రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని, జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు . అనంతరం ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు స్ఫూర్తితో అనేక సంవత్సరాలు వాళ్ళ అనుభవాలను రాబోయే దశాబ్దాల ను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ నీ తనఅహంకార ధోరణి తో అవమానపరచడం బాధాకరమని తెలిపారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పేంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు ఎమ్మెల్యేలు ఎంపీల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదారం రాజు గౌడ్, మాజీ ఎంపిటిసి పుట్టి భాస్కర్, ఎస్సీ డిపార్ట్మెంట్ పటాన్చెరు కన్వీనర్ కొనింటి మహేష్, యనగండ్ల నరేందర్, పోచమ్మల స్వామి ,పల్నాటి భాస్కర్ ,కంది ఎల్లయ్య ,మాదారం వార్డు సభ్యులు కుమార్ భవాని ,అశోక్ ,పట్నం శీను ,సీతారాం రాజు సింగ్, సత్యనారయణ లక్ష్మన్, వెంకటేష్ .రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…