Telangana

అమీన్పూర్ లో ఘనంగా సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడా గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ బుధవారం లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత, శారీరిక దారుఢ్యం తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో తగు ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మూలంగా గ్రామీణ స్థాయి క్రీడాకారులు నేడు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్నారని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, సర్పంచులు కృష్ణ, నితీశా శ్రీకాంత్, భాస్కర్ గౌడ్, మాధవి రవి, లలిత మల్లేష్, మల్లేష్, సీఐ శ్రీనివాసులు రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత, ఎంపీడీవో మల్లీశ్వర్, ఎంఈఓ రాథోడ్, సీనియర్ నాయకులు రాజు, జ్ఞానేశ్వర్, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago