Telangana

పీహెచ్‌డీకి దక్షిణాఫ్రికాను ఎంచుకోండి_ గీతం విద్యార్థులకు క్వాజులు నాటల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రాజశేఖర్ సూచన

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ )

విద్యా వ్యవస్థ మెరుగు కోసం దక్షిణాఫ్రికా భారీగా పెట్టుబడి పెట్టిందని, పీహెచ్‌డీ లేదా పోస్ట్ డాక్టరల్ డిగ్రీ చేయాలనుకునే వారికి అది ఓ చక్కని గమ్యమని ఆ దేశానికి చెందిన క్వాజులు నాటల్ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ కె.రాజశేఖర్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ ని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ప్రజారోగ్యం కోసం రసాయన శాస్త్రం, సంశ్లేషణ, ఔషధ ఆవిష్కరణ, జీవనమోదు పరికరాలు’ అనే అంశంపై శనివారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మేళవింపుతో పాటు వైవిద్యభరితమైన ప్రకృతి శోభతో నిండిన దక్షిణాఫ్రికాలో పీహెచ్‌డీకి, పోస్ట్ డాక్టరల్ కోర్సులను అభ్యసించాలని అభిలషించే విద్యార్థులకు ఉత్తేజకరమైన వాతారణం ఉన్నట్టు డాక్టర్ రాజశేఖర్ చెప్పారు.

విద్యతో పాటు అందమైన సముద్ర తీరాలలో సేదతీరొచ్చని, గంభీరమైన పర్వతాలను అధిరోహించే వీలు కూడా ఉందన్నారు. గీతం విద్యార్థులు ఎవరైనా పీహెచ్‌డీ చేయాలనుకుంటే, మార్కులతో నిమిత్తం లేకుండా, పరిశోధన రంగంలో రాణించాలనే బలమైన కోర్కె పట్టుదల ఉన్నవారు తనను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. వారికి ఉచిత విద్య, వసతి సౌకర్యాలతో పాటు ఒక ల్యాప్టాప్, అత్యాధునిక పరిశోధనాశాల, పరిశోధనలకు అవసరమైన రసాయనాలు, పరికరాలన్నింటినీ ఉచితంగానే సమకూరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే అడగడానికి మొహమాట పడొద్దన్నారు. ‘మిమ్మల్ని ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు, ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి, కాని రాణించాలి, పైకి రావాలనే తపన ముఖ్యం’ అని డాక్టర్ రాజశేఖర్ స్పష్టీకరించారు. ఈ సందర్భంగా ఆయన చేపట్టిన పలు పరిశోధనల వివరాలు, వాటి పురోగతి, సాధించిన ఫలితాలు, వెలువరించిన పరిశోధనా పత్రాలు, వచ్చిన మేధోహక్కులను తెలియజేయడంతో పాటు బీఎస్సీ, ఎమ్మెస్సీ, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జీవీ రామారావు, స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ అతిథిని జ్ఞాపికలను ఇచ్చి సత్కరించారు. స్కూల్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆతిథ్య ఉపన్యాసంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సురేంద్రబాబు ఎంఎస్ స్వాగతోపన్యాసం. చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ కుమార్ కటారి వందన సమర్పణ చేశారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

5 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

5 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

1 day ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

1 day ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

2 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

2 days ago