Telangana

వంద మాటలను ఒక్క చిత్రంతో చెప్పొచ్చు…

– వర్క్షాప్ వాటర్ కలర్ ఔత్సాహికుడు శ్యామ్ కర్రి ఉద్బోధ

మనవార్తలు ,పటాన్ చెరు:

వంద మాటలను ఒక్క చిత్రం ద్వారా చెప్పొచ్చని , అలానే ఓ ఇంటి ఆకృతిని రంగుల సచిత్రంగా రూపొందిస్తే చాలా సమయం , డబ్బు ఆదా అవుతాయని వాటర్ కలర్ ఔత్సాహికుడు శ్యామ్ కర్రి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ‘ ఆకృతులను వాటర్ కలర్ ద్వారా ప్రదర్శించడం’పై శుక్రవారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , నిర్మాణ రూపకల్పన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని , ఇది ప్రాజెక్టు నిర్వహణను , స్పష్టమైన రూపాన్ని అందిస్తుందన్నారు . డిజెన్ ప్రక్రియ పునరావృతమవుతుందని , సమస్యను నిర్వచించడం , సమాచారాన్ని సేకరించడం , మేథోమథనం / విశ్లేషించడం , మెరుగుపరచడం , ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడం , చివరగా తుది రూపునివ్వడంగా ఆయన వివరించారు .

ముందుగా , చేపట్టదలచిన ప్రాజెక్టును బాగా అధ్యయనం చేయాలని , తరువాత కంప్యూటర్ పరిజ్ఞానంతో దానికి ఓ రూపునివ్వాలని , క్షేత్రస్థాయికి తగ్గట్టుగా ఆ రూపకల్పన జరిగిందా లేదా అనేది పరిశీలించాలని శ్యామ్ చెప్పారు . డిజెనర్ నిరంతరం సమీక్షిస్తూ తన సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేస్తారని , దానిని మరింత మెరుగుపరుస్తారని , అంతిమంగా తుది రూపునిస్తారని చెప్పారు . వర్ధమాన వాస్తుశిల్పులు ముందుగా భావనలను ఏర్పరచుకోవాలని , దానిని అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పగలగాలన్నారు . తొలుత , స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీలక్కుమార్ అతిథిని విద్యార్థులకు పరిచయం చేసి , కార్యశాలను ప్రారంభించారు . అసోసియేట్ ప్రొఫెసర్ శమంత్ కుమార్ వెంకటరత్నం భట్టు దీనిని సమన్వయం చేశారు . బీఆర్క్ విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని వాటర్ కలర్ డిజైన్లను నేర్చుకున్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

11 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago