మనవార్తలు ,పటాన్ చెరు;
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న పథకాలకు శ్రీ కారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని లక్డారం గ్రామ పరిధిలోని అమర్ కుమార్తె వివాహానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 15 వేల ఆర్థిక సాయం అందించారు.
పేదింటి తల్లిదండ్రులు బిడ్డల వివాహానాకి ఎన్నో కష్టాలు పడుతున్నారని..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ అన్నలా లక్ష నూటపదహార్ల రూపాయలు అందిస్తున్నాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో తమ గ్రామ పరిధిలో వివాహం చేసుకునే పేద బిడ్డలకు తనవంతు సాయంగా సహాయం అందిస్తున్నట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు .కష్టల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…