మనవార్తలు ,పటాన్ చెరు:
దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.చిట్కుల్ గ్రామంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ సంబరాలు తెరాస జెండాను ఆవిష్కరించి, కేకు కట్ చేసి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కొత్త రాష్ట్రం వచ్చాక రెండుసార్లు కేసిఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తెరాసకు మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గతంలో తెరాస జెండా పట్టుకోని వారిని సైతం వారిచేత జెండా రెపరెపలాడించేలా చేశారని అన్నారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, వృద్ధాప్య, అసారా పింఛన్లే కాక కేసీఅర్ కిట్టు ఇలాంటి అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూసుకు పోతున్నారని తెలిపారు. దేశానికి చుక్కానిలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు నిలుస్తున్నాయి ఆయన తెలిపారు.
తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని చెప్పిన నల్లారి కిరణ్ కుమార్ మాటలను తారుమారు చేస్తూ 24 గంటల కరెంటు అందిస్తూ తెలంగాణలో వెలుగులు పంచుతుంటే పక్క రాష్ట్రంలో లో చీకటి బతుకులు అయ్యాయని ఎద్దేవాచేశారు ప్రధాని సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి కిసాన్ పథకంలో నగదు జమ చేస్తున్నారని అన్నారు. దళిత బంధు త్వరలో అర్హులందరికీ వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అంబేద్కర్ ఆశయాల మేరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కుల మత వర్గాలకు అతీతంగా తెలంగాణలో పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను సుందరాంగి తీర్చిదిద్దారన్నారు. సుల్తాన్ పూర్ వంటి పారిశ్రామిక వాడలు నెలకొల్పి చాలామందికి ఉపాధి కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ విలేజ్ ప్రసిడెంట్ ప్రశాంత్, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, క్రిష్ణ, వెంకటేష్, బుజంగం, మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఎన్ఎమ్ఎమ్ యువసేన పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…