politics

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశనానికే ఆదర్శం _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు:

దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.చిట్కుల్ గ్రామంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ సంబరాలు తెరాస జెండాను ఆవిష్కరించి, కేకు కట్ చేసి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కొత్త రాష్ట్రం వచ్చాక రెండుసార్లు కేసిఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తెరాసకు మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గతంలో తెరాస జెండా పట్టుకోని వారిని సైతం వారిచేత జెండా రెపరెపలాడించేలా చేశారని అన్నారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, వృద్ధాప్య, అసారా పింఛన్లే కాక కేసీఅర్ కిట్టు ఇలాంటి అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూసుకు పోతున్నారని తెలిపారు. దేశానికి చుక్కానిలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు నిలుస్తున్నాయి ఆయన తెలిపారు.

తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని చెప్పిన నల్లారి కిరణ్ కుమార్ మాటలను తారుమారు చేస్తూ 24 గంటల కరెంటు అందిస్తూ తెలంగాణలో వెలుగులు పంచుతుంటే పక్క రాష్ట్రంలో లో చీకటి బతుకులు అయ్యాయని ఎద్దేవాచేశారు ప్రధాని సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి కిసాన్ పథకంలో నగదు జమ చేస్తున్నారని అన్నారు. దళిత బంధు త్వరలో అర్హులందరికీ వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని  అంబేద్కర్ ఆశయాల మేరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కుల మత వర్గాలకు అతీతంగా తెలంగాణలో పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను సుందరాంగి తీర్చిదిద్దారన్నారు. సుల్తాన్ పూర్ వంటి పారిశ్రామిక వాడలు నెలకొల్పి చాలామందికి ఉపాధి కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ విలేజ్ ప్రసిడెంట్ ప్రశాంత్, పిఎసిఎస్  చైర్మన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, క్రిష్ణ, వెంకటేష్, బుజంగం, మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఎన్ఎమ్ఎమ్ యువసేన పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago