మనవార్తలు ,పటాన్చెరు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పటాన్చెరు నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇకనుండి భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించడంతో.. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఆ పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భూమిక పోషిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. గల్లి నుండి ఢిల్లీ దాకా అన్ని స్థాయిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ రాష్ట్ర సమితి పటాన్చెరు పట్టణ అధ్యక్షులు అఫ్జల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…