గీతంలో రక్తదాన శిబిరం

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహణ  140 మంది రక్తదానం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో బుధవారం (31-12-2025న) రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ అధ్యాపక, విద్యార్థి సమన్వయకర్తలతో కలిసి, గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఈ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 140 మంది […]

Continue Reading

పట్నం విందు రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్ డీ ఆర్ ఫౌండేషన్ మాద్రి పృథ్వీరాజ్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : పట్నం విందు రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్ డీ ఆర్ ఫౌండేషన్  మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహారంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. రుచికరమైన వంటకాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే వ్యాపార రంగంలో ముందుకు వస్తున్న యువకులు సమాజ […]

Continue Reading

మౌళిక అంశాలపై పట్టు – ఉద్యోగానికి తొలి మెట్టు

ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన గూగుల్ ఇంజనీర్ రోహిత్ కీర్తాంకర్ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : సాంకేతిక ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి డేటా నిర్మాణాల పనితీరుపై అవగాహనతో పాటు మౌళిక అంశాలపై పట్టు తప్పనిసరని గూగుల్ ఏడీఎస్ సొల్యూషన్స్ ఇంజనీర్ కీర్తాంకర్ స్పష్టీకరించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘గూగుల్ స్పీకర్ సెషన్: జాబితా, మ్యాప్, O(1) మ్యాజిక్’ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. గీతంలోని గూగుల్ డెవలపర్ గ్రూప్ ఆన్ క్యాంపస్ […]

Continue Reading

అర్థవంతమైన లక్ష్యాలను సాధించాలి యువతకు జేఎన్ యూ ప్రొఫెసర్ డాక్టర్ గుడవర్తి అజయ్ ఉద్బోధ

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేటి తరం విద్యార్థులు అర్థవంతమైన లక్ష్యాలను సాధించాలని, సమాజానికి సృజనాత్మకంగా దోహదపడాలని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్ యూ)లోని రాజకీయ అధ్యయనాల కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ రాజకీయ సిద్ధాంతకర్త, విశ్లేషకుడు డాక్టర్ అజయ్ గుడవర్తి సూచించారు.గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘జెన్ జీ (నేటి యువత) – భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు’ […]

Continue Reading

సిఐటియు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

సిగాచి ఘోర ప్రమాదానికి 6 నెలలు సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఐడిఏ పాశమైలారం క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : సీగాచి ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు బలైన ఘటనకు 6 నెలలు గడిచి పోయిందని, అయినా నేటికీ బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం పూర్తిగా అందలేదని, పెండింగ్ నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఐడిఏ పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్ అతిమేల […]

Continue Reading

సిగాచి పరిశ్రమ కార్మికుల కుటుంబాలకు పూర్తిస్థాయిలో నష్టపరిహారము చెల్లించాలి _సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : సిగాచి పరిశ్రమ కార్మికుల కుటుంబాలకు పూర్తిస్థాయి నష్టపరిహారము చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సిగాచి పరిశ్రమలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో ఇప్పటివరకు 25 లక్షల నష్టపరిహారం మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. పరిశ్రమలో ప్రమాదం సంభవించి ఆరు నెలలు పూర్తవుతున్న ఇప్పటివరకు మిగతా […]

Continue Reading

గీతంలో అంతర్జాతీయ సదస్సు

జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల జంతు శాస్త్రవేత్తల సంఘం (ఎల్ఏఎస్ఏ) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధన’ పేరిట అంతర్జాతీయ సదస్సును ఈనెల 19-20 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ 13వ అంతర్జాతీయ ప్రీక్లినికల్ సదస్సుకు ముందురోజు, డిసెంబర్ 18న ఒక కార్యశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహక కార్యదర్శులు డాక్టర్ జి. […]

Continue Reading

విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఎంతో అవసరమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో పటాన్ చెరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేట్ పాఠశాలల క్రీడా పోటీలను ఎమ్మెల్యే జిఎంఆర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

Continue Reading

జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో విశిష్ట వక్తగా గీతం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో విశిష్ట వక్తగా పాల్గొని, తన నైపుణ్యాలను ఇతరులతో పంచుకుంటున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. భువనేశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల ఈనెల 1-2 తేదీలలో డేటా ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె విశిష్ట వక్తగా పాల్గొన్నట్టు తెలిపారు. అందులో ఆమె ఐవోటీ, సెన్సార్ టెక్నాలజీలపై […]

Continue Reading

రాష్ట్ర, జాతీయ క్రీడలకు చిరునామా పటాన్ చెరు _ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ క్రీడలకు వేదికగా పటాన్ చెరు పట్టణాన్ని తీర్చిదిదరుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా గత మూడు రోజులుగా జరుగుతున్న 44వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా అండర్ 14 బాలుర బాలికల కోకో […]

Continue Reading