ఘనాపూర్ సాయిబాబా ఆలయం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు మండలం ఘనపూర్ గ్రామ పరిధిలోని శ్రీ సాయి బాబా దేవాలయం 7 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

పటాన్ చెరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

_చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: రైతాంగం పండించిన చివరి వరి ధాన్యం గింజ కొనుగోలు చేసేంత వరకు కొనుగోలు కేంద్రాలు పని చేస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండల ముత్తంగి, లక్డారం, పటాన్చెరు పిఎసిఎస్ పరిధిలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో […]

Continue Reading

గీతం స్కాలర్ శ్వేతకు పీహెచ్ డీ…

మనవార్తలు ,పటాన్ చెరు: ఎంహెచ్ డీ ఉచిత ఉష్ణప్రసరణ ప్రవాహంపై వేడి , ద్రవ్యరాశి బదిలీ ప్రభావం : ఫినెట్ ఎలిమెంట్ పద్ధతి ‘ అనే అంశంపై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని శ్వేత మట్టాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్లోని గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ […]

Continue Reading

మైనారిటీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేసిందని _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు: చిట్కుల్ గ్రామం లో రంజాన్ మాసం పురస్కరించుకొని మసీదులో షేక్ అష్రఫ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రంజాన్ పవిత్ర మాసం లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో రోజా నిర్వహించి అనంతరం ఇస్తారు విందులో పాల్గొనడం మంచి విశేషమని అన్నారు .మైనార్టీలకు ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని  హిందూ ముస్లిం భాయి భాయి అంటూ అందరూ కలిసి ఉండటం అనాదిగా వస్తుందని తెలిపారు ఒకరి పండుగలో […]

Continue Reading

ఫార్మా పాఠశాలతో అవగాహన…

మనవార్తలు ,పటాన్ చెరు: హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఇటీవల ది ఫార్మా పాఠశాలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఫార్మా పాఠశాల మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణతో తాను , తమ అసోసియేట్ ప్రొఫెసర్ కింగ్స్టన్ రాజయ్య అవగాహనా ఒప్పంద పత్రాలను మార్చుకున్నట్టు తెలియజేశారు . ఫార్మా పాఠశాల అనేది విద్యావేత్తలు , ఫార్మా పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం […]

Continue Reading

తెలంగాణలో తిరుగులేని రాజకీయ పార్టీ టిఆర్ఎస్_చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

మనవార్తలు ,శేరిలింగంపల్లి: ఈ నెల 27వ తేదీన టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మియపూర్ నరేం గార్డెన్ లో నిర్వహిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం విస్తృత స్థాయి సర్వసభ్య సమావేశానికి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైకు ర్యాలీగా బయలు దేరారు . అనంతరం మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్న, మన ముఖ్యమంత్రి తెలంగాణలో […]

Continue Reading

“తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన _కవయిత్రి శ్రీమతి మంజీత కుమార్

మనవార్తలు,హైదరాబాద్: ఉత్తర  అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ కవితల పోటీలు” నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన, ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న కవయిత్రి శ్రీమతి మంజీత కుమార్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో జూమ్ లో  తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద శ్రీమతి మంజీత కుమార్ తమ కవితను వినిపించబోతున్నారు. దేశానికి వెన్నుముక […]

Continue Reading

కృషి డిఫెన్స్ కాలనీ లో మిషన్ భగీరథను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రతి కాలనీకి విస్తరిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీ లో ఇంటింటికి మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీవాసులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు కాలుష్యానికి కేరాఫ్ […]

Continue Reading

ఇంద్రేశం చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ

_వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ మనవార్తలు ,పటాన్ చెరు: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజా సంక్షేమం కోసం తన పరిపాలనలో అనుసరించిన విధానాలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలోని రామేశ్వరం బండ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ […]

Continue Reading

ఆషియా ఫాండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు

మనవార్తలు ,శేరిలింగంపల్లి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ప్రాణాలు కాపాడాలని ఆషియా ఫాండేషన్ వారు తెలిపారు చందానగర్ డివిజన్ లోని పీజేఆర్ స్టేడియంలో ఆషియా ఫాండేషన్ వారు ఏర్పాటు చేసిన రక్తదానం శిభిరాన్ని కి ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆషియా ఫాండేషన్ వారు రక్తదాన శిభిరాన్ని ఎర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు .అన్ని దానాల్లో కెల్లా రక్తదానం చాలా గొప్పదని […]

Continue Reading