Telangana

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద చిన్నారులకు ఆపన్న హస్తం అందించిన బీఆర్ఎస్ యువనేత నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ వినూత్న కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు .ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందంటారు. అలాంటి మహాలక్ష్ములకు తన వంతుగా ప్రొత్సాహం అందిస్తున్నారు . తన గ్రామంలో పుట్టిన ప్రతి శిశువుకు ఐదు వేల రూపాయలు ఫిక్డ్స్ డిపాజిట్ చేసి..వారి భవిష్యత్ కు భరోసా కల్పిస్తున్నారు .గత ఏడాది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జన్మదినంను పురస్కరించుకుని జూన్ 2 వతేదీ 2022 ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు .గత ఏడాది 22 మంది చిన్నారులకు ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఈ కార్యక్రమాన్ని నర్విరామంగా కొనసాగిస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 50 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల ఫిక్డ్స్ డిపాజిట్ చేసి తన ఉదారత చాటుకున్నాడు . 50 మంది చిన్నారుల తల్లిదండ్రులకు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను అందించారు .సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు .ముఖ్యంగా కేసీఆర్ కిట్, ఆడ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ లాంటి పథకాలతో చేయూతనందిస్తున్నారు. మహిళ భద్రత కోసం షీ టీంలను ప్రవేశపెట్టి అన్నగా రక్షణ కల్పిస్తున్నాడని తెలిపారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

నేడు దేశ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని ,ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు . సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులో తాను మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని…తనని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో పటాన్చెరు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపినాయుడు,MPHO కృష్ణాప్రసాద్,ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ,భుజంగం,శ్రీను,మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, యాదగిరి,ఆంజనేయులు, మాజీ PACS చైర్మెన్ నారాయణ రెడ్డి,బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్,ANM వాణీ,గోపాల్,శ్రీను,అనిల్,నరేష్,వెంకటేశ్, ఆశ వర్కర్లు, మహిళలు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

17 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

18 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago