Telangana

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద చిన్నారులకు ఆపన్న హస్తం అందించిన బీఆర్ఎస్ యువనేత నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ వినూత్న కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు .ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందంటారు. అలాంటి మహాలక్ష్ములకు తన వంతుగా ప్రొత్సాహం అందిస్తున్నారు . తన గ్రామంలో పుట్టిన ప్రతి శిశువుకు ఐదు వేల రూపాయలు ఫిక్డ్స్ డిపాజిట్ చేసి..వారి భవిష్యత్ కు భరోసా కల్పిస్తున్నారు .గత ఏడాది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జన్మదినంను పురస్కరించుకుని జూన్ 2 వతేదీ 2022 ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు .గత ఏడాది 22 మంది చిన్నారులకు ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఈ కార్యక్రమాన్ని నర్విరామంగా కొనసాగిస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 50 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల ఫిక్డ్స్ డిపాజిట్ చేసి తన ఉదారత చాటుకున్నాడు . 50 మంది చిన్నారుల తల్లిదండ్రులకు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను అందించారు .సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు .ముఖ్యంగా కేసీఆర్ కిట్, ఆడ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ లాంటి పథకాలతో చేయూతనందిస్తున్నారు. మహిళ భద్రత కోసం షీ టీంలను ప్రవేశపెట్టి అన్నగా రక్షణ కల్పిస్తున్నాడని తెలిపారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

నేడు దేశ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని ,ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు . సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులో తాను మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని…తనని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో పటాన్చెరు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపినాయుడు,MPHO కృష్ణాప్రసాద్,ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ,భుజంగం,శ్రీను,మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, యాదగిరి,ఆంజనేయులు, మాజీ PACS చైర్మెన్ నారాయణ రెడ్డి,బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్,ANM వాణీ,గోపాల్,శ్రీను,అనిల్,నరేష్,వెంకటేశ్, ఆశ వర్కర్లు, మహిళలు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

4 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

4 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

4 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

2 weeks ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

2 weeks ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

2 weeks ago