Telangana

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం _ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్రంలో పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలు, కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నదని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల నిర్మాణానికి, పునర్నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. టెంపుల్ టూరిజం కూడా పెద్దపీట వేస్తుందని నీలం మధు ముదిరాజ్ అన్నారు.అందోల్ నియోజకవర్గపరిధిలోని, అందోల్ మండలం మసానిపల్లి గ్రామంలో దేవాలయ కమిటీ చైర్మన్ పి నారాయణ ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయానికి నిర్వహించిన శంకుస్థాపనలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ దేవాలయం నిర్మాణానికి తన వంతు సహకారంగా 4 లక్షల రూపాయలు స్టీల్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. జాతరలు ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణ చోటు చేసుకుటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగలకు ప్రాధాన్యత కల్పించిందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజుగారు, సిద్దేశ్వర్,చాపల వెంకటేశం,నాగభూషణం, చింతల నర్సింలు, ఏరారం సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి,తాడు మనూరు సర్పంచ్ అనిల్ రెడ్డి, వివిధ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

10 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

12 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago