Telangana

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం _ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్రంలో పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలు, కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నదని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల నిర్మాణానికి, పునర్నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. టెంపుల్ టూరిజం కూడా పెద్దపీట వేస్తుందని నీలం మధు ముదిరాజ్ అన్నారు.అందోల్ నియోజకవర్గపరిధిలోని, అందోల్ మండలం మసానిపల్లి గ్రామంలో దేవాలయ కమిటీ చైర్మన్ పి నారాయణ ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయానికి నిర్వహించిన శంకుస్థాపనలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ దేవాలయం నిర్మాణానికి తన వంతు సహకారంగా 4 లక్షల రూపాయలు స్టీల్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. జాతరలు ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణ చోటు చేసుకుటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగలకు ప్రాధాన్యత కల్పించిందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజుగారు, సిద్దేశ్వర్,చాపల వెంకటేశం,నాగభూషణం, చింతల నర్సింలు, ఏరారం సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి,తాడు మనూరు సర్పంచ్ అనిల్ రెడ్డి, వివిధ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago