Telangana

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం _ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్రంలో పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలు, కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నదని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల నిర్మాణానికి, పునర్నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. టెంపుల్ టూరిజం కూడా పెద్దపీట వేస్తుందని నీలం మధు ముదిరాజ్ అన్నారు.అందోల్ నియోజకవర్గపరిధిలోని, అందోల్ మండలం మసానిపల్లి గ్రామంలో దేవాలయ కమిటీ చైర్మన్ పి నారాయణ ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయానికి నిర్వహించిన శంకుస్థాపనలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ దేవాలయం నిర్మాణానికి తన వంతు సహకారంగా 4 లక్షల రూపాయలు స్టీల్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. జాతరలు ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణ చోటు చేసుకుటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగలకు ప్రాధాన్యత కల్పించిందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజుగారు, సిద్దేశ్వర్,చాపల వెంకటేశం,నాగభూషణం, చింతల నర్సింలు, ఏరారం సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి,తాడు మనూరు సర్పంచ్ అనిల్ రెడ్డి, వివిధ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago