_శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ లలో జోరుగా అక్రమ నిర్మాణాలు
– అక్రమ నిర్మాణదారులకు కొమ్ముకాస్తున్న అధికారి, చైన్ మెన్ లు
శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
కంచే చేను మేసిన చందంగా అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారే అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వ అందయానికి గండీ కొడుతూ అందినకాడికి దండుకొంటున్నాడనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ ల పరిధిలోని శ్రీరామ్ నగర్ ఎ, బి, సి, బ్లాకుల్లోను, రాఘవేంద్ర, రాజరాజేశ్వరి కాలనిల్లో కేవలం రెండు, మూడు అంతస్థులకు అనుమతులు తీసుకొని నాలుగు, నుండి ఏడు ఆ పైన పెంట్ హౌస్ లు నిర్మిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న అక్రమ నిర్మాణం దారుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. వీటిని నిర్మూలిoచాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారి, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే చైన్ మెన్లు లక్షల రూపాయల లంచం పుచ్చుకొని అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి. సర్కిల్ మొత్తానికి ఒక్కరే సెక్షన్ అధికారం ఉండడంతో చైన్ మెన్లు కలిసి లంచాలకు తెరలేపి అక్రమ నిర్మాణాలకు వంతపాడుతూ లక్షలు వెనుకేసుకుంటూ ప్రభుత్వ ఆధాయానికి గండి కొడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
చర్యలు తీసుకుంటారా ?
ఈ వ్యవహారం పై ద్రుష్టి సారించిన జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం రోజు నోడల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తక్షణమే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అదేశించారు. కానీ ముందే ముడుపులు పుచ్చుకున్న అవినీతి అధికారులు అందరిపై చర్యలు తీసుకుంటారా లేకపోతే బడా బాబులను వదిలేసి చిన్న, చిన్న వారిపై తూ తూ మంటూ కంటి తుడుపు చర్యలతో సరిపెడతారా అనేది వేచి చూడాలి అంటున్నారు స్థానికులు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…