మనవార్తలు ,మియాపూర్ :
గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు యోగనంద్ పాల్గొని మహరాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి వందనాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశంకోసం హిందు ధర్మంకోసం ఆయన సేవలు కొనియాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం పని చేశారు అని అన్నారు. కేవలం గిరిజనుల అభ్యున్నతి కోసంమే కాకుండా భారత సాంస్కృతి సంప్రదాయాలను కాపాడిన మహనీయులు అని కొనియాడారు.అలాగే సేవాలాల్ మహరాజ్ మానవ మాతృడు కాదు అని దైవంతా సంబుతులని అన్నారు. దేశ ప్రజలు ముఖ్యంగా యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.దేశం పట్లా ధర్మం పట్లా ఆయన ఎన్నో సేవలు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నడిగడ్డ తండా అధ్యక్షులు తిరుపతి నాయక్, ప్రధాన కార్యదర్శి రత్నకుమార్,దశరథ్, సీతారాం నాయక్,బీజేపీ సీనియర్ నాయకులు మణిక్ రావు, శ్రీధర్ రావు,విజేందర్,ఆకుల లక్ష్మణ్, రామకృష్ణ, రవీందర్ నాయక్,వినోద్,ప్రభాకర్, పాపయ్య,కళ్యాణ్,శ్రీను,వెంకట్,నాయకులు, తండా సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
వియెన్ డాంగ్ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై రెండు వారాల కార్యశాల నిర్వహణ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం…
అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :…
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…