Telangana

ఉద్యోగ సృష్టికర్తలుగా ఉండండి

కేఎస్ పీపీ పట్టాల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన కౌటిల్యా విద్యార్థులంతా ఉద్యోగ సృష్టికర్తలుగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అభిలషించారు. ప్రతిష్టాత్మక కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) తృతీయ పట్టభద్రుల దినోత్సవాన్ని ఏప్రిల్ 16న (బుధవారం) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలోని కిన్నెర్ సెమినార్ హాలులో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ అకడమిక్ ప్రొసెషన్ తో ప్రారంభమైన ఈ వేడుక జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకుంది. పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీలను అందుకుంటున్న విద్యార్థులను ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. జాతీయంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజా విధాన రూపకల్పనలో వారు పోషించే కీలక పాత్రను తన స్పూర్తిదాయక ప్రసంగంలో ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

‘మీరు వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నప్పుడు, సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించే జ్జానం, విలువలు, ఉద్దేశ్యాన్ని మీతో తీసుకెళ్లండి’ అని ఆయన ఉద్బోధించారు. సాంప్రదాయ మార్గాలను మించి ఆలోచించమని గ్రాడ్యుయేట్లను ప్రోత్సహిస్తూ, ‘ఉద్యోగ సృష్టికర్తలుగా ఉండండి. విధాన వ్యవస్థాపకతను అన్వేషించండి. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. కొన్నిసార్లు మీరు ఉపరితలంపైకి ఏమి పెరుగుతుందో చూడటానికి నీటిని కదిలించాలి. త్వరగా నేర్చుకోండి, నడవండి, పరుగెత్తండి, ఎగరండి- కానీ ఎల్లప్పుడూ మీ పాదాలను స్థిరంగా ఉంచండి’ అని ఉద్బోధించారు.గీతం అధ్యక్షుడు, విశాఖపట్టణం పార్లమెంటు సభ్యుడు ఎం.శ్రీభరత్ తన అధ్యక్షోపన్యాసంలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథి రామ్మోహన్ నాయుడును శ్రీభరత్ సత్కరించగా, కేఎస్ పీపీ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ కన్వాల్ సభకు పరిచయం చేశారు.

ఈ ఏడాది 30 మంది విద్యార్థులకు పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీలను ప్రదానం చేశారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బంగారు పతకాలను ఇచ్చి సత్కరించారు. మాస్టర్స్ ప్రోగ్రామ్ లో అగ్రస్థానంలో నిలిచిన ఒయిషిక్ భట్టాచార్యను గీతం అధ్యక్షుడి పేరిట ఏర్పాటు చేసిన బంగారు పతకంతో సత్కరించారు. చెరుకూరి శ్రీహర్షకు యనమంద్ర మల్లికార్జునరావు బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. రోహిత్ సింగ్ గౌతమ్ ఉత్తమ క్యాప్ స్టోన్ ప్రాజెక్టుకు గాను గౌరవనీయమైన డీన్ బంగారు పతకాన్ని అందుకున్నారు. డిగ్రీ ప్రదానోత్సవాన్ని కేఎస్ పీపీ డీన్, ఐక్యరాజ్య సమితిలో భారతదేశ పూర్వ శాశ్వత ప్రతినిధి ప్రొఫెసర్ సయ్యద్ అక్బరుద్దీన్ నిర్వహించగా, ముఖ్య అతిథి డిగ్రీలు, సర్టిఫికెట్లను విద్యార్థులకు ప్రదానం చేశారు. గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖరన్, డిగ్రీ రికార్డులను అధికారికంగా గీతం ఉప కులపతి ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజాకు అందజేశారు. గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు కేఎస్ పీపీ విద్యార్థి వైభవి అవస్థికి ప్రతిజ్జ ప్రతిని అందజేయగా, ఆమె విద్యార్థులతో బిగ్గరగా ప్రతిజ్జ చేయించారు.

 

 

 

 

 

మాస్టర్స్ పట్టాను అందుకున్న విద్యార్థి షితిజ్ ఝా, 2025 తరగతి సమిష్టి ప్రయాణం, వారి ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ గ్రాడ్యుయేషన్ ప్రసంగం చేశారు. అధ్యాపకులు, యాజమాన్యాల అంకితభావం, మార్గదర్శకాలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేశారు. చివరిగా, కేఎస్ పీపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వసుధ కట్జు వందన సమర్పణ, ఆ తరువాత జాతీయ గీతాలాపనతో ఈ పట్టాల ప్రదానోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago