Telangana

బీసీ కులగణన చారిత్రాత్మకం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్

మాటల్లో కాదు చేతల్లో చూపిన నాయకుడు రేవంత్ రెడ్డి 

తెలంగాణలో పెరగనున్న బీసీల రాజకీయ అవకాశాలు

బీసీ లోకమంతా కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డి కి రుణపడి ఉంటాం

ముఖ్యమంత్రి ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దేశంలో ఎక్కడ లేని విధంగా జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసిన బీసీ కులగణన చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో నీలం మధు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించి తెలంగాణలోని బీసీల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ దశాబ్దాలుగా బీసీలలో రాజకీయ చైతన్యం ఉన్నా రాజకీయ ప్రాతినిధ్యం అవకాశం లేక చాలామంది బీసీలు నాయకులుగా ఎదగలేకపోయారని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బృహత్ సంకల్పంతో కులగణన ని చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ వర్గాలకు కులగణన పట్ల ఇచ్చిన హామీని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ప్రజలకు సంక్షేమం అభివృద్ది సామాజిక న్యాయం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రానున్న రోజుల్లో బీసీ బిడ్డలంతా రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తూ బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వానికి తెలంగాణ బీసీలమంతా రుణపడి ఉంటామన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

18 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

19 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago