చిట్కుల్‌లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జి టి ఎన్ కాలనీలో శ్రీరామనము సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ సహకారంతో కళ్యాణ వేడుకలు అత్యంత వైభవోపేతంగా కోనసాగాయి. నీలం మధు సొంత నిధులతో నిర్మించిన ఈ ఆలయంలో గత ఐదు రోజులుగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు […]

Continue Reading

గీతంలో డిజిటల్ సాన్నిహిత్యంపై ఆతిథ్య ఉపన్యాసం

విద్యా పరిశోధనను విపులీకరించిన సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ తేజస్విని నిరంజన మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్లం, ఇతర భారత విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ సాన్నిహిత్యం: అంతర్-ఆసియాలో యువతులు అనే శీర్షిక శుక్రవారం ప్రత్యేక ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని గీతంలోని సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ తేజస్విని నిరంజన అందించారు.ఆసియా […]

Continue Reading

వ్యాపార నిర్ణయంలో ఏఐ&ఎంఎల్ వినియోగంపై కార్యశాల

గీతంలో మే 25 నుంచి 29 వరకు, ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ‘వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ మేధస్సు & యంత్ర అభ్యాసం’పై మే నెల 25 నుంచి 29వ తేదీ వరకు, ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు ఐదు రోజుల ఆన్ లైన్ ఆచారణాత్మక కార్యశాల […]

Continue Reading

గ్రామాల సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మెదక్ ఎంపీ రఘునందన్ రావు తో కలిసి గుమ్మడిదల మండలంలో ఎన్ఆర్ఇజిఎస్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ప్రతినిధి , గుమ్మడిదల : గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, రామిరెడ్డిబావి, కానుకుంట గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో […]

Continue Reading

దోమడుగు అభివృద్ధికి సంపూర్ణ సహకారం

దోమడుగులో 79 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , గుమ్మడిదల : నూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు వార్డులో హెట్రో డ్రగ్స్ పరిశ్రమ సౌజన్యంతో 79 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, రక్షిత […]

Continue Reading

చిట్కుల్ లో శాస్త్రోక్తంగా శ్రీ సీత రామ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం 

ముగిసిన ద్విదినాత్మక ప్రతిష్ఠాపన క్రతువులు భక్తులకు దర్శనం ఇచ్చిన సీతా రాములు భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్థులు, కాలనీ వాసులు, భక్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ సొంత నిధులతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జిటిఎన్ కాలనీలో నిర్మించిన శ్రీ హనుమ సమేత సీతా రామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా ముగిసింది.గత […]

Continue Reading

సీఎస్ఈలో రావి దీప్తికి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని రావి దీప్తి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘వాహనాల ఇంటర్నెట్ లోకి తెలివిగా చొరబడటాన్ని గుర్తించే వ్యవస్థ (స్మార్ట్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్) కోసం సమర్థవంతమైన అభ్యాస-ఆధారిత విధానం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.హిమబిందు బుధవారం […]

Continue Reading

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు _పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే మా లక్ష్యం లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలతో పాటు  గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు […]

Continue Reading

యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి_ పటాన్ చెరు సిఐ వినాయక్ రెడ్డి

భగత్ సింగ్ వర్ధంతి సభలో పటాన్ చెరు సిఐ వినాయక్ రెడ్డి వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య సిఐటియు ఆధ్వర్యంలో ప్రణం ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు: యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి తెలిపారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ప్రణం […]

Continue Reading

గీతంలో జాతీయ టెక్ ఫెస్ట్ హవానా ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు రోజుల జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ హవానా-2026 మంగళవారం హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లో ఘనంగా ప్రారంభమైంది. సాంకేతిక నైపుణ్యం అనుభూతులతో స్ఫూర్తిని రగిల్చే ఈ కార్యక్రమాన్ని ఈఈసీఈ విభాగానికి చెందిన జీ-ఎలక్ట్రా (స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్) నిర్వహిస్తోంది. అత్యాధునిక ఆవిష్కరణలను అన్వేషించడానికి, సృజనాత్మకతను పెంపొందించడానికి, అవకాశాల సరిహద్దులను పునర్నిర్వచించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఈ ప్రతిష్టాత్మక […]

Continue Reading