Telangana

పర్యాటక కేంద్రాలుగా. పటాన్‌చెరు చెరువులు

10 కోట్ల 78 లక్షల రూపాయలతో పటాన్‌చెరు తిమ్మక్క చెరువు,

ముత్తంగి ఎంక చెరువుల అభివృద్ధి,సుందరీకరణ పనులకు శంకుస్థాపన

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామ పరిధిలోని ఎంక చెరువులను హెచ్ఎండిఏ ద్వారా 10 కోట్ల 78 కోట్ల లక్షల రూపాయలతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రెండు చెరువుల వద్ద సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు, ముత్తంగి పరిధిలో ప్రజలకు ఆహ్లాద కేంద్రాలుగా ఉండేందుకు చెరువులను సుందరీకరణ చేపడుతున్నామని తెలిపారు. ప్రతి చెరువు కట్ట పైన సెంట్రల్ లైటింగ్ సిస్టం, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు పార్క్, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అతి త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధులు సరిపోని పక్షంలో సి ఎస్ ఆర్ ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, హెచ్ఎండిఏ చెరువుల విభాగం డి ఈ రామకృష్ణ, ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్, తెల్లాపూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ పటాన్చెరువు పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, సిల్వేరి శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, కిట్టు, రామకృష్ణ, యాదయ్య, ప్రభాకర్ గుప్తా, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, అంజాద్,

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

5 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

5 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

5 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

17 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

20 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago