Telangana

వ్యాపారాభివృద్ధిలో కృత్రిమమేథది కీలక భూమిక’

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఉత్పత్తి అభివృద్ధి ప్రక్రియలను మెరుగుపరచడానికి, మార్కెట్ను వేగవంతం చేయడానికి, పోటీతత్వాన్ని పొందేందుకు స్టార్టప్లు కృత్రిమ మేథను వినియోగిస్తున్నాయని ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ప్రముఖ ఇన్నోవేటర్ చెత్తన్య ముప్పాల చెప్పారు. గీతం వర్సిటీలోని వెంచర్ డెవలప్ మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా, బుధవారం ఆయన ‘కృత్రిమ మేథ భవిత, ఉత్పత్తి అభివృద్ధి మెళకువలపై విద్యార్థులకు దిశానిర్దేశనం చేశారు. ఉత్పత్తి అభివృద్ధి భవిష్యత్తును అంచనా వేయడానికి బహుళజాతి కంపెనీలు కృత్రిమ మేథ (ఏణ)ను ఎలా వినియోగిస్తారో ఆయన వివరించారు. మనదేశంలో కూడా ఉత్పత్తి అభివృద్ధిలో కృత్రిమమేథ సామర్థ్యాన్ని నిరివిగా వినియోగిస్తున్నారని చెప్పారు.

ఏఐ అల్గారిథమ్ ద్వారా విస్తారమైన డేటాను వర్ధమాన వ్యవస్థాపకులు ఎలా? విశ్లేషించాలో చెత్తన్య వివరించారు. ఏఐ ఆధారిత విశ్లేషణలను ఉపయోగించడం ద్వారా స్టార్టర్లు, ఉత్పత్తి అభివృద్ధిలోమరింత సమాచారంతో నిర్ణయాలు తీసుకోవచ్చని, తద్వారా నిర్దిష్ట వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించవచ్చని ముప్పాల నిశదీకరించారు.విద్యార్థుల స్టార్టన్ల కోసం ‘రెడీ-సెట్-గో’ అనే ప్రీ-ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని NUIDea ప్రోగ్రామ్ మేనేజర్ కునాల్ గిర్ నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన, నిర్మాణాత్మక వనరులు, మార్గదర్శకత్వం అందించడం ద్వారా వినూత్న ఆలోచనలను ఆచరణీయ వ్యాపార సంస్థలుగా మార్చడం, వారి అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యంగా ఆయన వివరించారు.

ఈ ఆరు రోజుల సమ్మర్ స్టార్టప్ స్కూల్ ‘ఇంక్యుబేటర్ ఫీల్డ్ విజిట్, సంగారెడ్డి జిల్లా, కందిలోని ‘అక్షయపాత్ర’తో పాటు ఐఐటీ హైదరాబాద్ సందర్శనతో ముగిసింది. దీనిని వీడీసీ సీనియర్ వెంచర్ కోచ్, కార్యక్రమ నిర్వాహకులు వాసుదేవ్ వంగర, యామిని కృష్ణ రాపేటిలు పర్యవేక్షించారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

18 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

18 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago