Hyderabad

కన్నుల పండుగగా గీతం పన్నెండో స్నాతకోత్సవం

పటాన్ చెరు:

– గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీకి గౌరవ డాక్టరేట్

– 1300 పైగా విద్యార్థులకు పట్టాల ప్రదానం • అత్యుత్తమ ప్రతిభ చాటిన
-13 మందికి బంగారు పతకాలు

హైదరాబాద్ , పటాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12 వ స్నాతకోత్సవం కన్నుల పండుగగా జరిగింది . గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ ( డీఎస్సీ ) ని ప్రదానం చేశారు . కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2020-21 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ , మేనేజ్ మెంట్ , సైన్స్ , ఫార్మశీ , హ్యుమానిటీస్ కోర్సులు పూర్తిచేసిన దాదాపు 1300 మంది పట్టభద్రులకు డిగ్రీలను , 13 మంది టాపర్లకు బంగారు పతకాలను అందజేశారు .

బీటెక్ అన్ని విభాగాలలో అత్యుత్తమ ర్యాంకుతో పాటు సీఎస్ఈ విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించిన అరవపల్లి ఈలో పోచిరాజు సాయి మౌనిక , బీఎస్సీ ( హానర్స్ ) కెమిస్ట్రీలో మందుమూల స్వర్ణ , బీఎస్సీ గణితంలో శృతి మానసి వావిలకొలను , బీఎస్సీ ఫిజిక్స్ లో క్షితిజ్ అజిత్ అథవాలే , ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోరండ్ల పవన్ , బీకాం ( హానర్స్ ) లో కేదాస్ అనురాగ్ , బీబీఏ ( మేనేజ్ మెంట్ అకౌంటింగ్ ) లో చింతలపూడి శ్రావణి , బీబీఏలో సౌజన్య వల్లభనేని , బీబీఏ ( ఫైనాన్షియల్ మార్కెట్స్ ) లో సూరె శ్రావణి , బీబీఏ ( బిజినెస్ అనెలిటిక్స్ ) లో డీఆర్ గీతాంజలి , ఎంబీఏలో ఎల్.తేజస్విని రావులు గీతం వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి పేరిట నెలకొల్పిన ప్రెసిడెంట్ బంగారు పతకాలను పొందారు .

బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రథమ ర్యాంకు సాధించిన పూర్ణిను సిగ్గానికి వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ సౌజన్యంతో నెలకొల్పిన టాపర్స్ బంగారు పతకాన్ని ప్రదానం చేశారు . పచ్చటి ప్రకృతి మధ్య నెలకొని ఉన్న గీతం ప్రాంగణం పట్టాలను అందుకోవడానికి వచ్చిన విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో కళకళలాడింది . ప్రయోజకులవుతున్న పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు మురిసిపోగా , పట్టాలు అందుకున్న విద్యార్థుల హిప్ హిప్ హుర్రే నినాదాలతో ప్రాంగణం మార్మోగింది . దీర్ఘ విరామం తరువాత కలిసిన మిత్రులను హృదయానికి హత్తుకోవడం వంటి దృశ్యాలు ఆకట్టుకున్నాయి .

పట్టభద్రులంతా ధవళ వస్త్రధారణ , ఎర్రని కండువాలతో వచ్చి భారతీయను వ్యక్తపరిచారు . బంగారు పతక విజేతలు , పట్టభద్రులు పలువురు గీతమ్ తో తమకున్న అనుబంధం , అక్కడ ఎదిగిన తీరు , విద్యనభ్యసించేటప్పటి పలు అంశాలను నెమరువేసుకున్నారు . మొత్తంగా పండుగ వాతావరణంలో గీతం 12 వ స్నాతకోత్సవం విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ , కార్యదర్శి ఎం.భరద్వాజ , వీసీ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ , ప్రోఏసీలు ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , ప్రొఫెసర్ డి.సాంబశివరావు , రిజిస్ట్రార్ డి.గుణశేఖరన్ , రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు .

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

58 minutes ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

3 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago