Hyderabad

కన్నుల పండుగగా గీతం పన్నెండో స్నాతకోత్సవం

పటాన్ చెరు:

– గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీకి గౌరవ డాక్టరేట్

– 1300 పైగా విద్యార్థులకు పట్టాల ప్రదానం • అత్యుత్తమ ప్రతిభ చాటిన
-13 మందికి బంగారు పతకాలు

హైదరాబాద్ , పటాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12 వ స్నాతకోత్సవం కన్నుల పండుగగా జరిగింది . గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ ( డీఎస్సీ ) ని ప్రదానం చేశారు . కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2020-21 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ , మేనేజ్ మెంట్ , సైన్స్ , ఫార్మశీ , హ్యుమానిటీస్ కోర్సులు పూర్తిచేసిన దాదాపు 1300 మంది పట్టభద్రులకు డిగ్రీలను , 13 మంది టాపర్లకు బంగారు పతకాలను అందజేశారు .

బీటెక్ అన్ని విభాగాలలో అత్యుత్తమ ర్యాంకుతో పాటు సీఎస్ఈ విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించిన అరవపల్లి ఈలో పోచిరాజు సాయి మౌనిక , బీఎస్సీ ( హానర్స్ ) కెమిస్ట్రీలో మందుమూల స్వర్ణ , బీఎస్సీ గణితంలో శృతి మానసి వావిలకొలను , బీఎస్సీ ఫిజిక్స్ లో క్షితిజ్ అజిత్ అథవాలే , ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోరండ్ల పవన్ , బీకాం ( హానర్స్ ) లో కేదాస్ అనురాగ్ , బీబీఏ ( మేనేజ్ మెంట్ అకౌంటింగ్ ) లో చింతలపూడి శ్రావణి , బీబీఏలో సౌజన్య వల్లభనేని , బీబీఏ ( ఫైనాన్షియల్ మార్కెట్స్ ) లో సూరె శ్రావణి , బీబీఏ ( బిజినెస్ అనెలిటిక్స్ ) లో డీఆర్ గీతాంజలి , ఎంబీఏలో ఎల్.తేజస్విని రావులు గీతం వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి పేరిట నెలకొల్పిన ప్రెసిడెంట్ బంగారు పతకాలను పొందారు .

బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రథమ ర్యాంకు సాధించిన పూర్ణిను సిగ్గానికి వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ సౌజన్యంతో నెలకొల్పిన టాపర్స్ బంగారు పతకాన్ని ప్రదానం చేశారు . పచ్చటి ప్రకృతి మధ్య నెలకొని ఉన్న గీతం ప్రాంగణం పట్టాలను అందుకోవడానికి వచ్చిన విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో కళకళలాడింది . ప్రయోజకులవుతున్న పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు మురిసిపోగా , పట్టాలు అందుకున్న విద్యార్థుల హిప్ హిప్ హుర్రే నినాదాలతో ప్రాంగణం మార్మోగింది . దీర్ఘ విరామం తరువాత కలిసిన మిత్రులను హృదయానికి హత్తుకోవడం వంటి దృశ్యాలు ఆకట్టుకున్నాయి .

పట్టభద్రులంతా ధవళ వస్త్రధారణ , ఎర్రని కండువాలతో వచ్చి భారతీయను వ్యక్తపరిచారు . బంగారు పతక విజేతలు , పట్టభద్రులు పలువురు గీతమ్ తో తమకున్న అనుబంధం , అక్కడ ఎదిగిన తీరు , విద్యనభ్యసించేటప్పటి పలు అంశాలను నెమరువేసుకున్నారు . మొత్తంగా పండుగ వాతావరణంలో గీతం 12 వ స్నాతకోత్సవం విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ , కార్యదర్శి ఎం.భరద్వాజ , వీసీ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ , ప్రోఏసీలు ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , ప్రొఫెసర్ డి.సాంబశివరావు , రిజిస్ట్రార్ డి.గుణశేఖరన్ , రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు .

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago