పటాన్ చెరు:
– గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీకి గౌరవ డాక్టరేట్
– 1300 పైగా విద్యార్థులకు పట్టాల ప్రదానం • అత్యుత్తమ ప్రతిభ చాటిన
-13 మందికి బంగారు పతకాలు
హైదరాబాద్ , పటాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12 వ స్నాతకోత్సవం కన్నుల పండుగగా జరిగింది . గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ ( డీఎస్సీ ) ని ప్రదానం చేశారు . కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2020-21 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ , మేనేజ్ మెంట్ , సైన్స్ , ఫార్మశీ , హ్యుమానిటీస్ కోర్సులు పూర్తిచేసిన దాదాపు 1300 మంది పట్టభద్రులకు డిగ్రీలను , 13 మంది టాపర్లకు బంగారు పతకాలను అందజేశారు .
బీటెక్ అన్ని విభాగాలలో అత్యుత్తమ ర్యాంకుతో పాటు సీఎస్ఈ విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించిన అరవపల్లి ఈలో పోచిరాజు సాయి మౌనిక , బీఎస్సీ ( హానర్స్ ) కెమిస్ట్రీలో మందుమూల స్వర్ణ , బీఎస్సీ గణితంలో శృతి మానసి వావిలకొలను , బీఎస్సీ ఫిజిక్స్ లో క్షితిజ్ అజిత్ అథవాలే , ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోరండ్ల పవన్ , బీకాం ( హానర్స్ ) లో కేదాస్ అనురాగ్ , బీబీఏ ( మేనేజ్ మెంట్ అకౌంటింగ్ ) లో చింతలపూడి శ్రావణి , బీబీఏలో సౌజన్య వల్లభనేని , బీబీఏ ( ఫైనాన్షియల్ మార్కెట్స్ ) లో సూరె శ్రావణి , బీబీఏ ( బిజినెస్ అనెలిటిక్స్ ) లో డీఆర్ గీతాంజలి , ఎంబీఏలో ఎల్.తేజస్విని రావులు గీతం వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి పేరిట నెలకొల్పిన ప్రెసిడెంట్ బంగారు పతకాలను పొందారు .
బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రథమ ర్యాంకు సాధించిన పూర్ణిను సిగ్గానికి వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ సౌజన్యంతో నెలకొల్పిన టాపర్స్ బంగారు పతకాన్ని ప్రదానం చేశారు . పచ్చటి ప్రకృతి మధ్య నెలకొని ఉన్న గీతం ప్రాంగణం పట్టాలను అందుకోవడానికి వచ్చిన విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో కళకళలాడింది . ప్రయోజకులవుతున్న పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు మురిసిపోగా , పట్టాలు అందుకున్న విద్యార్థుల హిప్ హిప్ హుర్రే నినాదాలతో ప్రాంగణం మార్మోగింది . దీర్ఘ విరామం తరువాత కలిసిన మిత్రులను హృదయానికి హత్తుకోవడం వంటి దృశ్యాలు ఆకట్టుకున్నాయి .
పట్టభద్రులంతా ధవళ వస్త్రధారణ , ఎర్రని కండువాలతో వచ్చి భారతీయను వ్యక్తపరిచారు . బంగారు పతక విజేతలు , పట్టభద్రులు పలువురు గీతమ్ తో తమకున్న అనుబంధం , అక్కడ ఎదిగిన తీరు , విద్యనభ్యసించేటప్పటి పలు అంశాలను నెమరువేసుకున్నారు . మొత్తంగా పండుగ వాతావరణంలో గీతం 12 వ స్నాతకోత్సవం విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ , కార్యదర్శి ఎం.భరద్వాజ , వీసీ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ , ప్రోఏసీలు ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , ప్రొఫెసర్ డి.సాంబశివరావు , రిజిస్ట్రార్ డి.గుణశేఖరన్ , రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…