పటాన్చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ సింఘా రూపొందించిన డిజైన్ పేటెంట్ ప్రముఖ ఇండియన్ పేటెంట్ జర్నల్ లో ప్రచురితమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పేటెంట్లు, డిజెన్లు, ట్రేడ్మార్క్ ల కంట్రోలర్ జనరల్ దీనిని ఆమోదించినట్టు శనివారం వెల్లడించారు. డాక్టర్ సుధాకర్ ను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఏకే మిట్టల్, అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు పేర్కొన్నారు.
విజయవంతంగా ముగిసిన జాతీయ సదస్సు
గీతం, హైదరాబాద్ లోని సీఎస్ఈ విభాగం అధ్వర్యంలో ‘కంప్యూటింగ్ – డేటా సైన్సెస్ లో ఇటీవలి ఆవిష్కరణలు’ అనే అంశంపై ఈనెల 12-13 తేదీలలో నిర్వహించిన ఆన్లైన్ జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా, వివిధ రాష్ట్రాల నుంచి సదస్యులు కంప్యూటర్ సైన్స్ లో ఇటీవలి ఆవిష్కరణలపై పత్ర సమర్పణ చేయగా, అందులో ఎంపిక చేసిన వాటిని ప్రచురించినట్టు సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ వివరించారు. ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ సి.చంద్రశేఖర్, ఎన్ఐటీ సూరత్ కల్ కు చెందిన ప్రొఫెసర్ అన్నప్ప తదితరులు ఈ సదస్సులో కీలకోపన్యాసం చేసినట్టు తెలియజేశారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…