_లోగో ఆవిష్కరణలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
_ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ప్రతియేటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృ తిక, యాజమాన్య (టెక్నో, కల్చరల్, మేనేజ్మెంట్ ఫెస్ట్) పండుగ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్నది. ఈ విషయాన్ని ఫెస్ట్ కన్వీనర్ డాక్టర్ సి.త్రినాథరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫెస్ట్ ప్రచారంలో భాగంగా, నవీకరించిన లోగోను ఇటీవల ఆవిష్కరించినట్టు ఆయన తెలిపారు. ప్రమాణ లోగో ఆవిష్కరణ సందర్భంగా గీతం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు (శాస్త్రీయ, జానపద, సామూహిక నృత్యాలను) ప్రదర్శించినట్టు ఆయన పేర్కొన్నారు. ట్రయాడ్ బ్యాండ్ ప్రదర్శన ఈ ఉత్సవానికే తలమానికంగా నిలిచి, ఆహూతులందరినీ అలరించిందన్నారు.లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో దాదాపు 1500 మంది గీతం విద్యార్థులు చురుకుగా పాల్గొని, ప్రమాణ-2024 ఉత్సవ నిర్వహణ కోసం తమ ఉత్సుకతను ప్రదర్శించినట్టు డాక్టర్ త్రినాథరావు తెలియజేశారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని స్టూడెంట్ లెఫ్ట్ బృందం పర్యవేక్షించి, సమన్వయం చేసిందన్నారు.గీతం, హైదరాబాద్ సాంకేతిక, సాంస్కృతిక, మేనేజ్మెంట్ వేడుకల కోసం వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఒకచోట చేర్చి, ఆకర్షణీయమైన, మరపురాని ప్రమాణ 2024ని ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధం చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
గీతంలో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం పలు ఆహ్లాదకర పోటీలలో పాల్గొన్న విద్యార్థులు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆరోగ్యం,…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన కుట్ర అని మాజీ…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్చెరు శాసన…
పటాన్చెరులో ఘనంగా మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : అత్యంత సామాన్య కుటుంబం…
పటాన్చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…