Telangana

పటాన్చెరు పట్టణానికి మరో కీలక ప్రభుత్వ శాఖ కార్యాలయం..

_ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి..

_పటాన్చెరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు షురూ..

_ఆదేశాలు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్

మనవార్తలు ,పటాన్ చెరు:

పట్టు వదలని విక్రమార్కుడిగా పేరుందిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విజయం సాధించారు. పటాన్చెరు పట్టణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సూచనలకు అనుగుణంగా బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ తో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హలో రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో రోజురోజుకి రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానికంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు స్పందించిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు.. పటాన్చెరు పట్టణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా కు ఆదేశాలు జారీ చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago