Telangana

అర్హులంతా ఓటరుగా నమోదు కావాలి…

– గీతం విద్యార్థులకు డిప్యూటీ తహశీల్దార్ రాములు సూచన

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

అర్హులు ఓటర్లుగా నమోదు కావాలని పటాన్చెరు డిప్యూటీ తహశీల్దార్ బొమ్మ రాములు పిలుపునిచ్చారు. నూతన ఓటర్ల నమోదుపై అవగాహనా కార్యక్రమాన్ని బుధవారం ఆయన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రాములు మాట్లాడుతూ, జిల్లాలో నూతన ఓటరు నమోదు శాతం ఆశించిన దానికంటే తక్కువగా ఉందన్నారు. దానిపై అవగాహన కల్పించేందుకు గాను 18 ఏళ్లు నిండిన వారితో ముఖాముఖి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఇప్పటికే ఓటరుగా నమోదు చేసుకున్నవారు ఏవైనా మార్పు చేర్పులు చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నామన్నారు.జనవరి 1, 2023కు 18 సంవత్సరాలు నిండిన వారంతా ఫారం-6ను నింపి నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలని, మార్పులు లేదా సవరణ (చిరునామా మార్పు) కోసం ఫారం-8 నింపాలని, ఇతర వివరాల కోసం 1950 టోల్ నంబర్కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు సంప్రదించవచ్చన్నారు. ఎన్నికల అధికారుల వివరాల కోసం www.nvsp.in యాప్ను సందర్శించాలని ఆయన సూచించారు.ఈ విషయాలన్నీ తోటి విద్యార్థులకు తెలియజేసి, అర్హులైన వారందరి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలని డిప్యూటీ తహశీల్దార్ సూచించారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

10 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

10 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

10 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

10 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

11 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago