మనవార్తలు ,శేరిలింగంపల్లి :
ప్రతీ వస్తువు కలుషితమవుతున్న ఈ రోజుల్లో వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విజేత సూపర్ మార్కెట్ అందజేస్తుందని కొండాపూర్ బ్రాంచ్ భవన యజమాని కృష్ణారెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 88 వ బ్రాంచ్ ను శుక్రవారం రోజు విజేత సూపర్ మార్కెట్ ఎం.డి జగన్మోహన్ రావు తో కల్సి ప్రారంభించారు. మెట్రో నగరమైన హైదరాబాద్ లో ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నప్పటికీ వాటి పోటీని తట్టుకుని నేడు 88 వ బ్రాంచ్ ప్రారంభించడం అభినందించదగిన విషయమని, వినియోగదారుల మన్ననలు పొందుతూ ముందు ముందు మరిన్ని బ్రాంచ్ లను ఏర్పాటు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇపుడున్న పోటీ ప్రపంచంలో వ్యాపారంలో రాణించాలంటే మాములు విషయం కాదని, అది అంకితభావం, దృఢ సంకల్పం ఉన్న జగన్మోహన్ రావు లాంటి వారికే సాధ్యమన్నారు. సుదీర్ఘ కాలం పాటు వ్యాపారం సాగి మంచి లాభాలు రావడంతో పాటు మరెంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…