Telangana

మెదడుకు పదునుపెట్టిన సాంకేతికోత్సవం

గీతంలో ఎపోచ్ 4.0 పేరిట మూడు రోజుల సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఎపోచ్ 4.0 పేరిట ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించిన సాంకేతికోత్సవాలు విద్యార్థుల మెదడుకు పదును పెట్టాయి. గీతం స్టూడెంట్స్ క్లబ్ సహకారంతో గిట్ హబ్ కమ్యూనిటీ నిర్వహించిన ఈ పోటీలు- ఆచరణాత్మక అభ్యాసం, పరస్పర సహకారం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై పట్టును పెంపొందించే లక్ష్యంతో సాగాయి.టెక్ ట్రివియాతో ఆరంభమైన ఈ కార్యక్రమం, సాఫ్ట్ వేర్ అభివృద్ధి, హార్డ్ వేర్, సైబర్ భద్రత, టెక్ చరిత్ర, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పాల్గొన్న వారి జ్జానాన్ని పరీక్షించేలా పోటీలు సాగాయి. దీని తరువాత డాకర్ 101 అనే ఆచరణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది విద్యార్థులను కంటైనరైజేషన్ కు పరిచయం చేసింది. ఇందులో కోర్ డాకర్ భావనలు, ఇన్ స్టాలేషన్, ముఖ్యమైన ఆదేశాలు, ఇమేజ్ బిల్డింగ్, కంటైనర్ నిర్వహణ వంటివి ఉన్నాయి.

రెండవ రోజు, ఓపెన్-సోర్స్ డెవలప్ మెంట్ పై జరిగిన కార్యక్రమం ద్వారా సహకార అభివృద్ధి పద్ధతులపై దృష్టి సారించారు. ఇక్కడ విద్యార్థులకు గిట్ హబ్ వంటి ప్లాట్ ఫామ్ లపై ఓపెన్-సోర్స్, సహకార వర్క్ ఫ్లోలను పరిచయం చేశారు. కాల పరిమితితో వినూత్న సాధనాలను రూపొందించడానికి, నిర్మించడానికి బృందాలను ప్రోత్సహించే ఉత్పాదకత సాధన కోడింగ్ ఛాలెంజ్ తో రెండో రోజు ముగిసింది.ఇక చివరి రోజున, ఆధునిక వెబ్ అప్లికేషన్ల కోసం పూర్తి ప్రాంప్ట్-టు-ప్రొడక్షన్ వర్క్ ఫ్లోను ప్రదర్శించే కార్యశాల ప్రాంప్ట్-టు-పేజ్, ఆ తరువాత ట్రెజర్ హంట్, సమస్య-పరిష్కారాన్ని నిర్వహించారు. చివరగా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)పై ఒక విజ్జానదాయక కార్యక్రమంతో ఎపోచ్ ముగిసింది. ఇందులో వాటి పరిమాణం, వినియోగం, ఓపెన్-సోర్స్ ఏఐ పర్యావరణ వ్యవస్థలోని పోకడలపై దృష్టి సారించారు.

ఉత్సాహభరితమైన వాతావరణానికి తోడు, ఈ కార్యక్రమం ఆసాంతం టెక్ ఆధారిత ఆటలు, సవాళ్లతో కూడిన ముఖాముఖి నేర్చుకునేలా స్టాళ్లను గిట్ హబ్ సభ్యులు ఏర్పాటు చేశారు. ఇది ఉత్సాహభరితమైన భాగస్వామ్యాన్ని ఆకర్షించడంతో, ఈ మూడు రోజులలో దాదాపు 200 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తంమీద, ఎపోచ్ 4.0 విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు, విశ్వాసాన్ని పెంపొందించడానికి, అభ్యాసం, పోటీ, సహకారం ద్వారా వాస్తవ-ప్రపంచ సాఫ్ట్ వేర్ అభివృద్ధిపై ఆచరణాత్మక అవగాహనను ఏర్పరచుకోవడానికి ఒక చక్కని వేదికను అందించింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago