Telangana

గీతమ్ లో విజయవంతమైన ‘ప్రమాణ–2024

అలరించిన మూడు రోజుల సాంకేతిక-సాంస్కృతికోత్సవం

– మిన్నంటిన కోలాహలం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ‘ప్రమాణ-2024’ పేరిట నిర్వహించిన మూడు రోజుల సాంకేతిక- సాంస్కృతికోత్సవం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో వర్సిటీలోని విద్యార్థులు వివిధ రంగాలలో తమ ప్రతిభ, నై పుణ్యాలను ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలను చూరగొన్నారు. ప్రమాణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాసన కామినేని కొణిదెల, గౌరవ అతిథిగా విచ్చేసిన విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ జి. వంశీకృష్ణ ఫెస్ట్ ను లాంఛనంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. లింగ భేదం లేకుండా విశేషమైన విజయాల కోసం కృషిచేయాలని, అత్యుత్తమ పనితీరును కనబరచాలని ఉపాసన హితవు పలికారు. వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులను బట్టి ఆయా రంగాలను ఎంచుకుని, అందులో రాణించాలని వంశీ సూచించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను పరీక్షించే అనేక కార్యక్రమాలు జరిగాయి. ట్రెజర్ హంట్, డాన్స్ వర్క్ షాప్ , ఆటో ఎక్స్ పో , బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ వంటి అనేక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు.

వీటికి అదనంగా, వర్క్ షాప్ లు , వివిధ పోటీలు, పాటలు, ర్యాంప్ వాక్, నృత్యాలు వంటి సాంకేతిక-సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి తోడ్పడ్డాయి. కళాకారుల ప్రతిభా ప్రదర్శన విభాగంలో, నేపథ్య గాయకులు రామ్ మిరియాల, సాహితీ చాగంటి సినీ పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఎన్ టీఈ డేటా ప్రాంతీయ అధినేత సంజీవ్ దేశ్ పాండే రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని, పలు పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.

ఇక చివరి రోజు ప్రాజెక్ట్ 91, నినా సుర్దాతో కూడిన డీజే నెట్తో ఫెస్ట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమం విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సంగీత యాత్రను కొత్త కోణంలోకి తీసుకెళ్లింది. ఈ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలు, ఇతరత్రా కార్యక్రమాలలో జంట నగరాలలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొని, తమ ప్రతిభా, నెపుణ్యాలను ప్రదర్శించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు పర్యవేక్షణ, మార్గదర్శనంలో రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, అధ్యాపక సలహాదారు ప్రొఫెసర్ పి.త్రినాథరావు, స్టూడెంట్ లెఫ్ట్ అధికారి జియో సిరిల్ పొడిపర, పలువురు అధ్యాపకులు, కోర్ కమిటీ ఈ ఫెస్ట్ ను పర్యవేక్షించి, విజయవంతంగా పూర్తయ్యేలా కృషిచేశారు.

 

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

4 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago