Telangana

గీతమ్ లో విజయవంతమైన ‘ప్రమాణ–2024

అలరించిన మూడు రోజుల సాంకేతిక-సాంస్కృతికోత్సవం

– మిన్నంటిన కోలాహలం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ‘ప్రమాణ-2024’ పేరిట నిర్వహించిన మూడు రోజుల సాంకేతిక- సాంస్కృతికోత్సవం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో వర్సిటీలోని విద్యార్థులు వివిధ రంగాలలో తమ ప్రతిభ, నై పుణ్యాలను ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలను చూరగొన్నారు. ప్రమాణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాసన కామినేని కొణిదెల, గౌరవ అతిథిగా విచ్చేసిన విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ జి. వంశీకృష్ణ ఫెస్ట్ ను లాంఛనంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. లింగ భేదం లేకుండా విశేషమైన విజయాల కోసం కృషిచేయాలని, అత్యుత్తమ పనితీరును కనబరచాలని ఉపాసన హితవు పలికారు. వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులను బట్టి ఆయా రంగాలను ఎంచుకుని, అందులో రాణించాలని వంశీ సూచించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను పరీక్షించే అనేక కార్యక్రమాలు జరిగాయి. ట్రెజర్ హంట్, డాన్స్ వర్క్ షాప్ , ఆటో ఎక్స్ పో , బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ వంటి అనేక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు.

వీటికి అదనంగా, వర్క్ షాప్ లు , వివిధ పోటీలు, పాటలు, ర్యాంప్ వాక్, నృత్యాలు వంటి సాంకేతిక-సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి తోడ్పడ్డాయి. కళాకారుల ప్రతిభా ప్రదర్శన విభాగంలో, నేపథ్య గాయకులు రామ్ మిరియాల, సాహితీ చాగంటి సినీ పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఎన్ టీఈ డేటా ప్రాంతీయ అధినేత సంజీవ్ దేశ్ పాండే రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని, పలు పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.

ఇక చివరి రోజు ప్రాజెక్ట్ 91, నినా సుర్దాతో కూడిన డీజే నెట్తో ఫెస్ట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమం విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సంగీత యాత్రను కొత్త కోణంలోకి తీసుకెళ్లింది. ఈ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలు, ఇతరత్రా కార్యక్రమాలలో జంట నగరాలలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొని, తమ ప్రతిభా, నెపుణ్యాలను ప్రదర్శించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు పర్యవేక్షణ, మార్గదర్శనంలో రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, అధ్యాపక సలహాదారు ప్రొఫెసర్ పి.త్రినాథరావు, స్టూడెంట్ లెఫ్ట్ అధికారి జియో సిరిల్ పొడిపర, పలువురు అధ్యాపకులు, కోర్ కమిటీ ఈ ఫెస్ట్ ను పర్యవేక్షించి, విజయవంతంగా పూర్తయ్యేలా కృషిచేశారు.

 

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago