Telangana

గీతంలో విజయవంతంగా పైలట్ శిక్షణ కార్యశాల

ఫ్లైట్ సిమ్యులేటర్ పై శిక్షణ ఇచ్చిన కెప్టెన్ విగో

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో ‘ఫ్లైట్ సిమ్యులేటర్’పై ఒకరోజు పైలట్ శిక్షణా కార్యశాలను గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, శిక్షకునిగా స్పేస్ జెన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) కెప్టెన్ విగో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్ర్తి వేదాల మాట్లాడుతూ, పైలటింగ్ సిస్టమ్స్ లో అనుభవం గడించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఏరోస్పేస్ లోని ప్రతి విద్యార్థీ కనీసం ఒక నెల నుంచి మూడు నెలల వరకు ఇంటర్న్ షిప్ లేదా పరిశ్రమ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని స్వీయ అనుభవం గడించాలని సూచించారు. విద్యార్థులకు అనువైన పరిశ్రమలను గుర్తించి, వారితో సంప్రదింపులు జరిపి, విలువైన శిక్షణావకాశాలను పొందాలన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని తాము అందిస్తామని భరోసా ఇచ్చారు. గీతమ్, హైదరాబాద్ లో ఏరోనాటికల్ సొసైటీ విద్యార్థి విభాగాన్ని ప్రారంభించాలని, అందుకు అవసరమైన రుసుములు సంస్థాగతంగా చెల్లిస్తామని విద్యార్థుల హర్షధ్వానల మధ్య హామీ ఇచ్చారు.

పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంతో పాటు, ఔత్సాహిక ఏరోస్పేస్ ఇంజనీర్ల కెరీర్ అవకాశాలను మెరుగుపరచే లక్ష్యంతో తాను ఈ కార్యశాలను నిర్వహిస్తున్నట్టు కెప్టెన్ విగో తెలియజేశారు. ఈ రంగంలో ఆచరణాత్మక అనుభవం ప్రాధాన్యాన్ని వివరిస్తూ, తమ అకాడమీలో శిక్షణ పొందిన వారిలో 400 మంది వరకు పైలట్ గా ఎంపికయ్యారని, ఇటీవలి పాసింగ్ అవుట్ పరేడ్ లో ఇరవై మంది తమ విద్యార్థులున్నట్టు చెప్పారు.ఫ్లైట్ సిమ్యులేటర్ ను పరిచేయించడంలో కెప్టెన్ విగో గీతం విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. విమానం నిలిపిన ప్రదేశం నుంచి పైకి ఎగిరే వరకు మొత్తం ప్రక్రియను వివరించారు. విమానాన్ని నియంత్రించడం, ఎత్తులో ప్రయాణిస్తూ చేసే విన్యాసాలు, గాలిలో ఉండగానే ఇంజన్ ఆపి డిప్ స్టిక్ ల్యాండింగ్ చేయడం వంటివి చేసి చూపి, ఫ్లైట్ సిమ్యులేటర్ అనుభవాన్ని విద్యార్థులకు కల్పించారు.

తమ ఏరోనాటికల్ సొసైటీ ఆధ్వర్యంలో గీతం ఏరోస్పేస్ విద్యార్థులను ఎయిర్ ఇండియా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భారత వైమానిక దళం స్టేషన్ల సందర్శన ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ సందర్శనతో పాటు అక్కడి పైలట్లతో ముఖాముఖి సంభాషణను కూడా ఏర్పాటు చేస్తామని, విమాన నియంత్రణ, ల్యాండింగ్ పద్ధతులు, పారాచూట్ ద్వారా అధిక వేగాన్ని తగ్గించి, సులువుగా ల్యాండింగ్ చేయడం వంటివి స్వయంగా చూసే ఏర్పాటు చేస్తామన్నారు. తొలుత, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ.అక్తర్ ఖాన్ అతిథులను స్వాగతించి, ఈ రంగంలో పైలట్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి బాధ్యతలను వివరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఎస్.కిషోర్ కుమార్ వందన సమర్పణతో ఈ కార్యశాల ముగిసింది.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

6 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

6 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

6 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

6 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago