politics

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఫలహారం బండి ఊరేగింపు..

_గల్లి గల్లి లో బోనాల పండుగ వాతావరణం..

_భారీ సంఖ్యలో కళారూపాలు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

_అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి..

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

ప‌టాన్ చెరులో ఆషాడమాసం బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ప్రతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటికీటలాడింది.ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది కళాకారులు, పోతురాజులు, శివ సత్తుల పూనకాలతో ప్రజలందరూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా ప‌టాన్ చెరు పట్టణంలోని వివిధ కాలనీలో గల అమ్మవారి దేవాలయాలను ఎమ్మెల్యే జిఎంఆర్ దర్శించుకున్నారు.

 

బోనం సమర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కుటుంబ సభ్యులు

బోనాల పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ, వారి కుటుంబ సభ్యులు ఏడుగుల్ల పోచమ్మ దేవాలయంలో బోనం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

19 minutes ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

2 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago