Telangana

గూడెం కార్మికులకు ఆపన్న హస్తం

సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో గాయపడ్డ కార్మికుడికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన కార్మికుడు అమర్ సింగ్

యాజమాన్యంతో మాట్లాడి రూ.25 లక్షల పరిహారం అందచేత

భవిష్యత్తులో అండగా ఉంటానని భరోసా

ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కార్మిక నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.పటాన్ చెరు పారిశ్రామికవాడలో ఎక్కడ ప్రమాదం జరిగిన కార్మికుల పక్షాన నిలబడుతూ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన పరిహారం అందిస్తూ కార్మిక పక్షపాతిగా నిలుస్తున్నారు.గతంలో అగర్వాల్ రబ్బర్ ఫ్యాక్టరీలో మరణించిన కార్మికుడికి 60 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పించిన తరహాలోనేఇదే రీతిలో పటాన్ చెరు లోని సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ కార్మికుడికి ఆపన్న హస్తం అందించారు.గత శనివారం శ్రీ సాయిబాబా సెల్యులోస్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ అమర్ సింగ్ అనే కార్మికుడు (59) తీవ్రంగా గాయపడ్డాడు. మెషిన్ లో పడి కుడి చేయిని కోల్పోయాడు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు కార్మికులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆశ్రయించారు.దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గూడెం బాధిత కార్మికుడికి మెరుగైన చికిత్స అందించాలని ద్రువ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం శ్రీ సాయి బాబా సెల్యులోజ్ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించి రూ.25 లక్షల పరిహారాన్ని ఇప్పించారు. బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు.భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కార్మికుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారాన్ని మర్చిపోలేమన్నారు. కార్మికుల పక్షాన నిలబడి సహాయం చేస్తున్న జిఎంఆర్ కు తామంతా రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజన్ సింగ్, ఆకుల శ్రీశైలం, పరిశ్రమ ప్రతినిధులు, బొందిలి సంక్షేమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

6 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago