ముఖ్యఅతిథిగా హాజరైన పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం డివిజన్లో స్త్రీ కన్వెన్షన్ లో కేరళ రాష్ట్ర ప్రధాన పండగ ఓనం పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేరళం రాష్ట్ర ముఖ్య పండగ ఓనం వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.ప్రేమ, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఓనం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలి.మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ అందరం కలిసిమెలిసి ముందుకు సాగాలి.ఈ ఓనం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ పిళ్ళై , జనరల్ సెక్రెటరీ వినోద్ కుమార్ , శశిధరన్ నంబియార్ , అనిల్ కుమార్ , సంతోష్ , సుదర్శన్ ,ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ , మిల్క్ రాజు తదితరులు పాల్గొన్నారు.
