దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ మండల ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ఇస్నాపూర్ మున్సిపల్ ఇస్నాపూర్ ఎక్స్ రోడ్‌లోని వినాయక (SRK) ఆటో యూనియన్ ఆధ్వర్యంలో, అలాగే ముత్తంగి డివిజన్ పరిధిలోని మణిసాయి కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ మండల ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు, పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు.దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని, యువత విద్య, ఉపాధి, సామాజిక సేవ రంగాల్లో ముందుకు సాగాలని గడీల శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *