GHMC
బల్దియా కార్మికులకు సేఫ్టీ కిట్లను పంపిణీ...
పటాన్ చెరు:
కోవిడ్ పరిస్థితుల్లో జీ హెచ్ ఎం సీ కార్మికుల కృషి ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోవిడ్ ను పూర్తిగా నివారించే క్రమంలో చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను అందిస్తున్నాయని అన్నారు.
కార్మికుల కృషిని ప్రభుత్వం గుర్తిస్తుందని, వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…