మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ బండల మల్లన్న జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను గురువారం ఆలయ ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 1, 2 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు కరోనా నిబంధనలకు అనుగుణంగా జాతర కు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.