పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్…
హైదరాబాద్:
ఇంకా ఐటీ రిటర్న్స్ చెయ్యలేదా…? మరేం పరవాలేదు. ఈ మార్చి 31 తో ముగిసిన 2020-21 రిటర్న్ దాఖలు గడువును మే 31 వరకు పెంచడం జరిగింది. దీనితో మీరు ఆలస్యం అయినా చింతించకర్లేదు. కేంద్రం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
ఈ మార్చి 31 తో ముగిసిన 2020-21 రిటర్న్ దాఖలు గడువును మే 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ అందర్నీ ఇబ్బందుల లోకి నెట్టేస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కష్టాలు పడాల్సి వస్తోంది.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం తో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగించాలని పన్ను చెల్లింపుదారులు, కర్సల్టెంట్లు తదితర వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణ లోకి తీసుకుని కేంద్రం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.
దీనితో అధికారిక ప్రకటనని కూడా విడుదల చేసారు. ఆదాయపు పన్ను చట్టం లోని 139 సెక్షనలోని సబ్ సెక్షన్(5) కింద సవరించిన రిటర్న్లను, సబ్ సెక్షన్(4) కింద ఆలస్యమైన రిటర్న్లను కూడా 2021 మార్చి 31 నాటికి సమర్పించాల్సి ఉండేదని కానీ వైరస్ తీవ్రత ఎక్కువ ఉండడం తో ఆ తేదీని మే 31 నాటికి పొడించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBTD) తెలిపింది.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…