GHMC

బల్దియా కార్మికుల కృషి ప్రశంసనీయం సేఫ్టీ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

Hyderabad Telangana

బల్దియా కార్మికులకు సేఫ్టీ కిట్లను పంపిణీ...

పటాన్ చెరు:

కోవిడ్ పరిస్థితుల్లో జీ హెచ్ ఎం సీ కార్మికుల కృషి ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోవిడ్ ను పూర్తిగా నివారించే క్రమంలో చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను అందిస్తున్నాయని అన్నారు.

కార్మికుల కృషిని ప్రభుత్వం గుర్తిస్తుందని, వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *