పటాన్చెరు నియోజకవర్గంలో గ్రామగ్రామాన ఎగిరిన నల్లజెండాలు

Districts politics Telangana

_మోడీ మొండివైఖరి పై వెల్లువెత్తిన నిరసన

_పటాన్చెరులో నల్లజెండా ఎగురవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు:

తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో రైతులు, వ్యవసాయ కూలీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ ఇళ్ల పై నల్ల జెండాలను ఎగురవేసి నిరసనను వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నల్ల జండా ఎగరవేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండిస్తున్న చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసేంత వరకు నిరంతర పోరాటాలు కొనసాగుతునే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *