Telangana

ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా

_గీతం అతిథి ఉపన్యాసంలో రూ ఎడ్యుకేషన్ చైర్మన్ రమేష్ పక్తానీ ప్రస్తావించారు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు, ఆరోగ్యకరమైన జీవనానికి స్వచ్ఛమైన యోగా జీవితం గడపడం | మంచిదని రూ ఎడ్యుకేషన్ చెర్మన్ రమేష్ సత్తాని అన్నారు. ప్రపంచ నూనసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘యోగా ద్వారా మానసిక ఆరోగ్యం’ (మెంటల్ వెల్నెస్ – యోగిక్ వే) అనే అంశంపై ఆయన గురువారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఆరోగ్యాన్ని సాధించడానికి ఒకరి ఉద్దేశం, చర్యలు, భావోద్వేగాలు, ఆలోచనలను శుద్ధి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు.మానవ శరీరం ఇంజనీరింగ్ గురించి చెబుతూ, ఇది 140 సంవత్సరాల సౌకర్యవంతమైన జీవితకాలం కోసంనిర్మితమైందని, అయినప్పటికీ సగటు వయస్సు 70 ఏళ్లు మాత్రమేనన్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు,పేలవమైన నీటి నాణ్యత, కలుషితమైన గాలి, నిశ్చల జీవనశెల్జి ద్వారా శరీరాన్ని దుర్వినియోగం చేయడం వల్ల క్రమంగా అది శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఎప్పుడు మాట్లాడాలో, సురెప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకుని వ్యవహరించాలని విద్యార్థులకు ఆయన హితవు పలికారు. నిశ్శబ్దం యొక్క శక్తిని ప్రస్తావిస్తూ, ఇతరులను సానుకూలంగా ప్రభావితం చేయడానికి ప్రసంగాన్ని ఒక వనరుగా ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను రమేష్ నొక్కిచెప్పారు.

ఆరోగ్యానికి సంబంధించిన మూడవ అంశం, భావోద్వేగాల శుద్ధీకరణ అని, దీనిని ‘భావ శుద్ధి’ అని కూడా అంటారని, భావోద్వేగాలు చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన వివరించారు. కోపాన్ని నియంత్రించుకోవడం, క్షమాపణను స్వీకరించడం అవశ్యమని, విధ్వంసక ప్రవర్తనకు దారితీసే అనియంత్రిత భావోద్వేగాలకు లోనుకాకూడ దని హెచ్చరించారు. అదే సమయంలో సానుకూల మనస్తత్వాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సమస్యలను సానుకూలంగా మలచుకుని, వెఫల్యాల నుంచి నేర్చుకోవాలని, అవకాశాలపై దృష్టి పెట్టాలని, వివిధ ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని రమేష్, పరాని సూచించారు.ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విలువైన అంతర్ద్రస్థులను అందించిన రమేషు కార్యక్రమ -సమన్వయకర్త డాక్టర్ దుర్గేష్ నందనీ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

admin

Recent Posts

క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

10 minutes ago

దేవాలయ భూమిని కాపాడండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…

4 hours ago

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

19 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

19 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

19 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

19 hours ago