ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా

politics Telangana

_గీతం అతిథి ఉపన్యాసంలో రూ ఎడ్యుకేషన్ చైర్మన్ రమేష్ పక్తానీ ప్రస్తావించారు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు, ఆరోగ్యకరమైన జీవనానికి స్వచ్ఛమైన యోగా జీవితం గడపడం | మంచిదని రూ ఎడ్యుకేషన్ చెర్మన్ రమేష్ సత్తాని అన్నారు. ప్రపంచ నూనసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘యోగా ద్వారా మానసిక ఆరోగ్యం’ (మెంటల్ వెల్నెస్ – యోగిక్ వే) అనే అంశంపై ఆయన గురువారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఆరోగ్యాన్ని సాధించడానికి ఒకరి ఉద్దేశం, చర్యలు, భావోద్వేగాలు, ఆలోచనలను శుద్ధి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు.మానవ శరీరం ఇంజనీరింగ్ గురించి చెబుతూ, ఇది 140 సంవత్సరాల సౌకర్యవంతమైన జీవితకాలం కోసంనిర్మితమైందని, అయినప్పటికీ సగటు వయస్సు 70 ఏళ్లు మాత్రమేనన్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు,పేలవమైన నీటి నాణ్యత, కలుషితమైన గాలి, నిశ్చల జీవనశెల్జి ద్వారా శరీరాన్ని దుర్వినియోగం చేయడం వల్ల క్రమంగా అది శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఎప్పుడు మాట్లాడాలో, సురెప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకుని వ్యవహరించాలని విద్యార్థులకు ఆయన హితవు పలికారు. నిశ్శబ్దం యొక్క శక్తిని ప్రస్తావిస్తూ, ఇతరులను సానుకూలంగా ప్రభావితం చేయడానికి ప్రసంగాన్ని ఒక వనరుగా ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను రమేష్ నొక్కిచెప్పారు.

ఆరోగ్యానికి సంబంధించిన మూడవ అంశం, భావోద్వేగాల శుద్ధీకరణ అని, దీనిని ‘భావ శుద్ధి’ అని కూడా అంటారని, భావోద్వేగాలు చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన వివరించారు. కోపాన్ని నియంత్రించుకోవడం, క్షమాపణను స్వీకరించడం అవశ్యమని, విధ్వంసక ప్రవర్తనకు దారితీసే అనియంత్రిత భావోద్వేగాలకు లోనుకాకూడ దని హెచ్చరించారు. అదే సమయంలో సానుకూల మనస్తత్వాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సమస్యలను సానుకూలంగా మలచుకుని, వెఫల్యాల నుంచి నేర్చుకోవాలని, అవకాశాలపై దృష్టి పెట్టాలని, వివిధ ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని రమేష్, పరాని సూచించారు.ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విలువైన అంతర్ద్రస్థులను అందించిన రమేషు కార్యక్రమ -సమన్వయకర్త డాక్టర్ దుర్గేష్ నందనీ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *