గీతమ్ లో ‘రేపటి ఆవిష్కర్తలను రూపొందించడం’పై వర్క్ షాప్

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రేపటి ఆవిష్కర్తలను రూపొందించడం: మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్/కృత్రిమ మేథ పాఠ్యాంశాల’పై రెండు రోజల కార్యశాలను నిర్వహించారు. ప్రస్తుత మార్కెట్, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడం, మెకానికల్ ఇంజనీరింగ్ నెపుణ్యం-ఆధారిత విద్యను రూపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహించినట్టు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి మార్గదర్శకత్వంలో, ప్రఖ్యాత పరిశోధనా సంస్థల నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొన్నట్టు తెలియజేశారు. సూరత్కల్లోని ఎన్ఐటీకే నుంచి ప్రొఫెసర్ ఎస్.ఎం. మురుగేంద్రప్ప, ఐఐటీ హెదరాబాద్ నుంచి ప్రొఫెసర్ ఆర్.ప్రశాంత కుమార్, వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ వి.వాసు తదితరులు పాల్గొని తమ విలువెన అవగాహనను పంచుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, కృత్రిమ మేథ, వినూత్న విధానాల అన్వేషణకు ఈ కార్యశాల ఒక వేదికగా ఉపయోగపడిందన్నారు. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడంలో వారు చురుకుగా పాల్గొని, పరిశ్రమ డిమాండుకు తగ్గట్టు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో తోడ్పాటును అందించినట్టు తెలిపారు. గీతం మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు కూడా ఈ కార్యశాలలో చురుకుగా పాల్గొని, ప్రతిపాదిత పాఠ్యాంశాలను మెరుగుపరచడానికి వారి అభిప్రాయాలు, తగు సూచనలను అందించినట్టు డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. పరిశ్రమ అవసరాలను ప్రతిబింబించేలా, విద్యార్థులకు సమగ్రమెన్ష, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేలా పాఠ్యాంశాలను రూపొందించడంలో వారు కీలక భూమిక పోషించినట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *