గీతం బీ – స్కూల్లో ‘ అల్గారిథమిక్ ట్రేడింగ్’పై వర్క్షాప్…

Districts Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ , హైదరాబాద్ ( జీఎస్బీ ) ; నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ( ఎన్ఎస్ఈ ) అకాడమీలు సంయుక్తంగా ఈనెల 26-27 తేదీలలో ‘ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫెన్షన్స్ యూజింగ్ పెథాన్ అండ్ ఆర్ ‘ రెండు రోజుల వర్చువల్ వర్క్షాపు నిర్వహించనున్నాయి . ఈ విషయాన్ని జీఎస్బీ ఫైనాన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్ . రాధిక మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . సెక్యూరిటీ మార్కెట్లలో పార్టిసిపెంట్ల నెపుణ్యాలు , సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ వర్క్షాప్ లక్ష్యమన్నారు . ఇందులో పాల్గొనే వారందరికీ అల్గారిథమిక్ ట్రేడింగ్ను పరిచయం చేయడంతో పాటు , వారిని నిజ – సమయ వ్యూహాలతో సన్నద్ధం చేయనున్నట్టు ఆమె వివరించారు . సిగ్నస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో ఎం . అరవింద్ , క్యాపిటల్ మార్కెట్లోని ఎస్ఎంఈ ఎల్.కన్నన్ , గీతం అధ్యాపకులు తమ విస్తృతమైన ట్రేడింగ్ అనుభవంతో ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు . ఆసక్తి గలవారు తమ పేర్ల నమోదు కోసం ఈనెల 24 వ తేదీలోగా డాక్టర్ ఎన్ . రూపలత 98481 17823 ని సంప్రదించాలని లేదా finghbsws21@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని ప్రొఫెసర్ రాధిక సూచించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *