గీతం బీ-స్కూల్లో ‘అల్గారిథమిక్ ట్రేడింగ్’పై వర్క్ షాప్…

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ (జీఎస్బీ); నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) అకాడమీలు సంయుక్తంగా ఈనెల 31 తేదీన ‘ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫైనాన్స్ యూజింగ్ పెథాన్ అండ్ ఆర్’ పై రెండు రోజుల వర్చువల్ వర్క్షాపు నిర్వహించనున్నాయి. గతంలో అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన ఈ వర్క్షాప్ను తిరిగి ఈ నెలాఖరున నిర్వహించనున్నట్టు జీఎస్బీ ఫైనాన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్. రాధిక మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనేవారి నైపుణ్యాలు, సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ వర్క్ ప్ లక్ష్యమన్నారు. ఇందులో పాల్గొనే వారందరికీ అల్గారిథమిక్ ట్రేడింగ్ను పరిచయం చేయడంతో పాటు, వారిని నిజ-సమయ వ్యూహాలతో సన్నద్ధం చేయనున్నట్టు ఆమె వివరించారు.సిగ్నస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో ఎం.అరవింద్, క్యాపిటల్ మార్కెట్ ని ఎస్ఎంఈ ఎల్.కన్నన్, గీతం అధ్యాపకులు తను విస్తృతమైన ట్రేడింగ్ అనుభవంతో ఈ వర్క్షాపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఆసక్తి గలవారు తమ పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం డాక్టర్ ఎన్. రూపలత 98481 17823ని సంప్రదించాలని లేదా finghbsws21@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని ప్రొఫెసర్ రాధిక సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *