యాదవుల సంక్షేమానికి కృషి

politics Telangana

_ప్రజల నమ్మకంతోనే హ్యాట్రిక్ విజయం సాధించాం

_ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

యాదవుల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, ఆర్థిక అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ కాలనీలో గల గోకుల్ ఫంక్షన్ హాలులో పటాన్చెరు యాదవ సంఘం ఆధ్వర్యంలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్నేతలని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినప్పుడే విజయం సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలకు ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *